దక్షిణాఫ్రికా వేరియంట్తో పెనుముప్పు.. ఇండియాకూ గండం..?
ఈ దక్షిణాఫ్రికా వేరియంట్ గురించి ఇప్పుడు ప్రపంచం అంతా హడలిపోతోంది. దీని ప్రభావంపై చర్చించేందుకు నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం కూడా అత్యవసరంగా సమావేశమైందంటే సీన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు.. ఈ కొత్త వేరియంట్ ప్రపంచంపై ఆర్థికంగానూ ప్రభావం చూపుతోంది. ఈ వేరియంట్ భయాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో మునిగాయి. ఇండియాలో స్టాక్ మార్కెట్లు దాదాపు 7 నెలల కనిష్టానికి పడిపోయాయి.
కరోనా కొత్త వేరియంట్ భయంతో దక్షిణాఫ్రికాకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నాయి. అంతే కాదు.. ఈ కొత్త వేరియంట్ గురించి ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసింది తక్కువే. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ దక్షిణాఫ్రికా వేరియంట్కు సంబంధించి ఇప్పటివరకూ వంద కంటే తక్కువ జినోమ్ సిక్వెన్స్లు చేశారట. ఇంకా పరిశోధన చేస్తే కానీ.. ఈ కొత్త వేరియంట్ పై పూర్తి అవగాహన వస్తుందట.
ఈ కొత్త వేరియంట్ కేసులు దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు 100కుపైగా వెలుగు చూశాయి. ఈ వేరియంట్తో ఇన్ఫెక్షన్లు, పాజిటివిటీ రేటు కూడా పెరుగుతున్నాయి. ఈ వైరస్ ఇతర దేశాలకు కూడా పాకుతోంది. ఇప్పటికే బోట్స్వానా, హాంకాంగ్లో ఈ తరహా కేసులు గుర్తించారు. ఇండియాలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్న సమయంలో ఈ వేరియంట్ నుంచి ఇండియాకూ ముప్పు ఉన్నట్టే.