ఆంధ్ర-తెలంగాణ మధ్య కొత్త వివాదం...!
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ధాన్యం లారీలను ఎందుకు అడ్డుకుంటున్నారని రైతులు, వ్యాపారులు నిలదీస్తున్నారు ఇప్పుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ వివాదం కొనసాగుతోంది. తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంపై కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య యుద్ధం జరుగుతోంది. ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ధర్నాలు కూడా చేస్తోంది. కేంద్రంపై ఒత్తిడి కూడా చేస్తోంది. ఇదే విషయం ఇప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెద్ద దుమారం రేపుతోంది కూడా అయితే రైతులు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... రైతుల నుంచి పూర్తిస్థాయిలో తీసుకోవటం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికీ కల్లాల్లో ధాన్యం అలాగే ఉందని... వర్షాల కారణంగా ధాన్యం తడిసి... మొలకలు వస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా. ఈ పరిస్థితుల్లో ఏపీ నుంచి వచ్చే ధాన్యాన్ని అడ్డుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.