ప్రగతి భవన్ నుంచి బయటకు రప్పించింది బీజేపీనే !

Veldandi Saikiran
కెసిఆర్ దీక్ష చేసింది తెలంగాణ రైతుల కోసమా ? లేక,  పంజాబ్ రైతుల కోసం దీక్ష చేశావా? సమాధానం చెప్పాలి.... కెసిఆర్ దీక్ష చేస్తే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేశారా? అని నిలదీశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  గతంలో ఢిల్లీ పోయి వచ్చి కేంద్ర పథకాలు భేష్ అన్నడు.. ఇప్పుడు ఢిల్లీ వెళ్లొచ్చి మళ్లీ ఏమి అంటాడో చూడాలని చురకలు అంటించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  

ఫాం హౌస్ నుంచి ప్రగతి భవన్ కు ప్రగతి భవన్ నుంచి బయటకు రప్పించింది బీజేపీ.. వాన కాలం పంట కొనాలని బిజెపి డిమాండ్  చేస్తుంటే.....కెసిఆర్  మాత్రం రైస్ మిల్లర్లు గురించి ఆలోచిస్తున్నాడన్నారని వెల్లడించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  రైతుల గోస పడుతుంటే కెసిఆర్ పట్టించుకోడ.. ? రైతులు ఇబ్బందులూ పడుతుంటే భరోసా ఇచ్చేందుకు బిజెపి రైతుల వద్దకు వెళ్ళింది..రైతుల వద్దకు వెళ్తే trs వాళ్ళు రాళ్ళ దాడి చేశారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  బిజెపి కార్యకర్తల రక్తం తో రైతుల కల్లాలు తడిసినయి..వర్షం లో రైతులు ఇబ్బందులూ పడుతున్నారు... వడ్లను వెంటనే కొనాలని డిమాండ్ చేస్తున్నాం...కెసిఆర్ ఎప్పుడు  ఏమీ మాట్లాడుతున్నాడో  ఆయనకే అర్థం కావడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. 


ఒకసారి రైతు చట్టాలకు వ్యతిరేసిస్తు ధర్నా చేస్తాడు ..ఒకసారి రైతు చట్టాలకు మద్దతు ఇస్తున్న అంటాడు...మరో సారి కోనుగోలు కేంద్రాలను తీసివేస్త అంటాడని నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  ఇంకోసారి ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొంటది అంటాడు...మళ్ళీ ఇప్పుడేమో వడ్లను కల్లాలకు తిసుకరావొద్దని చెప్తున్నడు...మళ్ళీ ఇప్పుడేమో కేంద్రం పై యుద్ధం అంటాడన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..
కెసిఆర్ ఒక స్పష్టత లేదు... ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు.. కొనుగోలు కేంద్రాల పై మంత్రులు ఒక తీరుగా కెసిఆర్ ఒక తీరుగ మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: