జగన్ బాబులాట - ఆంధ్రప్రజ నోట్లో పెండ:

VUYYURU SUBHASH
ఆంధ్రప్రదేశ్లో గత రెండున్నర సంవత్సరాల నుంచి అధికార వైసీపీ వ‌ర్సెస్‌ ప్రతిపక్ష టిడిపి మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం రోజురోజుకు చాలా జుగుప్సాకరంగా మారుతుంది. అసలు వీరిద్దరి మధ్య శాసన సభలోనూ బయట నడుస్తున్న రాజకీయ యుద్ధాల వ‌ల్ల ఎవరికి ఉపయోగం ? వీరి వల్ల రాష్ట్రానికి నయాపైసా ఉపయోగం ఉందా ? దివాలా స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని... రాష్ట్ర ప్రజల బాగోగులను పట్టించుకోవడం రెండు పార్టీలు ఎప్పుడో మానేశాయి.
కేవలం రాజకీయ పరమైన రాజకీయ కక్షతోనే ఈ రెండు పార్టీలు వాదోపవాదాలు చేసుకుంటూ వ‌స్తున్నాయి. ఇలాగే ఈ రెండు పార్టీలు మూడేళ్లుగా కాలం వెళ్లదీస్తూ వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు ముగిసి వైసిపి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. మరో రెండేళ్లలో మళ్లీ సాధారణ ఎన్నికలు వస్తాయి. మళ్లీ అధికారం కోసం అటు వైసిపి .. ఇటు టిడిపి రాజకీయపరమైన విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఈ రెండేళ్లు ఎలా వెళ్తాయి ? అని ఎదురు చూస్తున్నాయే తప్ప ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ... ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి... ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు ఎలా ? ఉంటాయన్న విషయంపై ఏ మాత్రం చర్చించటం లేదు.
అసలు వాళ్లకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు.. కేవలం రాజకీయపరమైన లాభాలు అధికారమే పరమావధిగా కనిపిస్తోంది. చివ‌ర‌కు వీరి రాజ‌కీయ స్వార్థ యుద్ధం వ‌ల్ల ఏపీ ప్ర‌జ‌లు కూడా రెండుగా చీలిపోయి బూతులు తిట్టుకుంటున్నారు. వీరి బూతుల తో ప్ర‌జ‌లు కూడా రోత తిట్లే తిడుతోన్న ప‌రిస్థితి ఉంది. సోష‌ల్ మీడియా లోనూ, అటు బ‌య‌ట ఎక్క‌డ చూసినా టీడీపీ , వైసీపీ నేత‌ల బూతులు , రంకు బాగోతాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఒక‌రికి ఒక‌రు రంకు అంటి చే ప్ర‌య‌త్న‌తాలే చేసుకుంటున్నాయి. మ‌రి ఏపీలో ఈ ప‌రిస్థితిలో ఎప్ప‌టికి మార్పు వ‌స్తుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: