కేసీఆర్కు ఓటమి భయం... దుమారం రేపుతున్న బియ్యం..!
సాధారణంగా తనదైన రాజకీయ వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయగల సత్తా ఉన్న నేత కల్వకుంట్ల చంద్రశేఖర్. ఆయన బయటకు వస్తున్నారంటే... ఎవరినో టార్గెట్ చేశారనేది సొంత పార్టీ నేతల్లో కూడా ఉన్న అభిప్రాయం. ఏ ఎన్నిక జరిగినా... ఏ వ్యూహం వెనుక అయినా... ఏ నేత ఆలోచన వెనుక అయినా సరే... కేసీఆర్ మాత్రమే ఉంటారు. అది కేటీఆర్ అయినా, హరీశ్ అయినా సరే.. కేసీఆర్ చెప్పినట్లు చేయాల్సిందే. అలాంటి వ్యూహకర్తను ప్రస్తుతం కమలం పార్టీ తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటే స్థానాన్ని గెలుచుకున్న కమలం పార్టీ... ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఖాతాలోని రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుంది. ఇక బలమైన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీ మెజారిటీ సీట్లు సొంతం చేసుకుంది. ఇవన్నీ కూడా కేసీఆర్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే.. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం ఓ పెద్ద రాజకీయ కుదుపుగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.