కమ్మ ఫ్రెండ్‌కు జగన్ బంపర్ ఆఫర్?

M N Amaleswara rao
వైసీపీ అంటే కేవలం రెడ్ది వర్గం నేతల హవానే ఎక్కువగా ఉంటుందని అంతా అనుకుంటారు. అలాగే రెడ్ది వర్గానికే ప్రాధాన్యత ఉంటుందని ప్రత్యర్ధులు విమర్శిస్తూ ఉంటారు. మిగిలిన వర్గాలకు జగన్ పెద్దగా న్యాయం చేయరని అంటారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఇతర వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. మంత్రివర్గంలో గానీ, ఇతర పదవుల విషయంలో సామాజికవర్గాల పరంగా న్యాయం చేసుకుంటూ వస్తున్నారు. అలా అని రెడ్ది వర్గానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రెడ్ది వర్గానికి ఎక్కువగానే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ముఖ్యంగా జగన్...కమ్మ వర్గానికి కూడా పెద్ద పీఠ వేస్తూ వస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక కమ్మ వర్గంపై కక్ష సాధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆఖరికి పవన్ కల్యాణ్ సైతం ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఒక కులాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని మాట్లాడారు. అయితే అదే కమ్మ వర్గానికి చెందిన కొడాలి నాని ఏ విధంగా జగన్‌కు సపోర్ట్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే.
అలాగే వైసీపీలో కమ్మ ప్రజాప్రతినిధులు ఎక్కువగానే ఉన్నారు.  మిగిలిన నేతలకు కూడా బాగానే ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా కమ్మ వర్గానికి చెందిన తన స్నేహితుడు తలశిల రఘురామ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. అసెంబ్లీలోనే తలశిల తన ఫ్రెండ్ అని జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
తలశిల మొదట నుంచి జగన్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. పైకి ఎప్పుడు కనబడకపోయినా, తెరవెనుక ఉండి పార్టీ కోసం కష్టపడుతుంటారు. అలాగే ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్తగా ఉంటూ, జగన్ పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని దగ్గర ఉండి చూసుకుంటారు. గతంలో పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. అలా జగన్‌కు సపోర్ట్‌గా ఉండే తలశిలకు ఎమ్మెల్సీ దక్కనుందని తెలుస్తోంది. ఈయనతో పాటు కమ్మ వర్గంలో ఉన్న సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌కు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: