పోలీసులపై వైసీపీ ఎంపీ విమర్శలు...!
165 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి...ఏ అధికారం ఉందని ఎయిడెడ్ కళాశాలలులను తీసుకుంటున్నారు అని ఆయన నిలదీశారు. కోర్టుకు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు,కోర్టును తప్పుదోవ పట్టించారు అని ఆయన విమర్శలు చేసారు. విశాఖపట్నం లో నాలుగు స్కూల్స్ వాళ్ళు మూసివేస్తామని చెప్పారు అని ఆయన ప్రస్తావించారు. ముఖ్యమంత్రి నియమించిన వ్యక్తి నాకు నచ్చిన్నటు నేను ఉంటా అంటే బాగోదు అని అన్నారు. మనం ఇచ్చే అమ్మఒడి ఏ మూలకు సరిపోదు...ఎయిడెడ్ స్కూల్స్ జోలికి వెళ్లొద్దు అని ఆయన విజ్ఞప్తి చేసారు.
పది ఏళ్ల బాలుడు విశాఖపట్నం లో ఎవరికి కావాలి నీ బెల్ట్ అని మాట్లాడాడు అని పది ఏళ్ల బాలుడిని స్ఫూర్తిగా అందరూ తీసుకోవాలి అని ఆయన సూచించారు. దయచేసి చెప్పుడు మాటలు విని ప్రజలకు అబ్దాలు చెప్పడం మంచిది కాదు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. నడుస్తున్న వ్యవస్థలను ఎందుకు సర్వనాశనం చేస్తున్నారు అని మండిపడ్డారు. దీనివలన ప్రభుత్వానికి,పార్టీకి నష్టం జరుగుతుంది అని అన్నారు. విద్యావ్యవస్థను గొప్పగా చేస్తామని అనుకోవచ్చు....మానేయండి... ప్రజల ఇబ్బందులు అర్ధం చేసుకోండి అని విజ్ఞప్తి చేసారు. ఎయిడెడ్ పాఠశాలలు, ఎయిడెడ్ కళాశాలలు గురించి ఆలోచించండి అని ఆయన విజ్ఞప్తి చేసారు. పోలీసు దూరగతలు దారుణంగా ఉన్నాయి అని ఆయన విమర్శలు చేసారు. 41A నోటీసు ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు,రూల్స్ ఫాలో అవ్వడం లేదు అని ఆయన విమర్శలు చేసారు.