బద్వేలు: 2019 ఎన్నికల్లో ఎవరికెన్ని ఓట్లు.. ఏం జరిగింది..!
ఇక బద్వేల్ ఉప ఎన్నిక ఈ నెల 30న జరుగుతోంది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపడతారు. బద్వేలు నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గ కేంద్ర మైన బద్వేలు - గోపవరం - అట్లూరు - బి. కోడూరు - పోరుమామిళ్ల - కాశినాయన - కలసపాడు మండలాలు ఉన్నాయి.
బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 2014లో కూడా ఇక్కడ వైపీపీ యే గెలిచింది. అప్పుడు జయరాములు 5 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది.
అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ... టీడీపీ అభ్యర్థి ఓబుళాపురం రాజశేఖర్ పై 44834 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇది మామూలు మెజార్టీ కాదనే చెప్పాలి. ఆ ఎన్నికల్లో వెంకట సుబ్బయ్యకు 95482 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి రాజశేఖర్కు 50748 ఓట్లు వచ్చాయి.