బీజేపీకి పవన్ సహాయ నిరాకరణ నేటితో సంపూర్ణం..
కరోనా ప్రభావం కారణంగా తాను ప్రచారానికి రావడం లేదని సీఎం జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ ఎన్నికలలో గెలిపించాలని ఓటర్లను కోరారు. సంక్షేమ పధకాల ద్వారా ఖర్చు చేసిన మొత్తం వివరాలను అందులో ప్రస్తావించారు. వైసీపీ ఈ విధంగా ప్రచారం చేస్తుంటే.. పోటీలో ఉన్న బీజేపీ మాత్రం ఓటర్లను ఆకట్టుకోలేకపోతోంది. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలెవరూ రాక పోవడంతో, ఆ పార్టీ నేతల్లో సహజంగానే ఉత్సాహం తగ్గింది. చివరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాలని ఎక్కడా నేరుగా చెప్పలేదు. కనీసం ఓ ప్రకటన కూడా విడుదల చేయలేదు. ప్రచారానికి ఆఖరి రోజు కావడంతో ఈ రోజైనా పవన్ కళ్యాణ్ తో ప్రకటన చేయించాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బద్వేల్ ఉపఎన్నికల విషయంలో సెంటిమెంట్ ను గౌరవిస్తూ పోటీ నుంచి జనసేన తప్పుకుందని.. అందుకే ఈ ఉపఎన్నికలలో పోటీ చేయమని పవన్ ఎప్పుడో ప్రకటించేశారు. చెప్పిన మాటకు కట్టుబడి బద్వేల్ ఉపఎన్నికల విషయంలో ఆయన మౌనంగానే ఉన్నారు. జనసేన కార్యకర్తలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపైనా ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
దీనిని బట్టి అర్ధమయ్యేది ఏమిటంటే.. బీజేపీ తన నిర్ణయం కాదని బద్వేల్ లో పోటీ చేసినందుకు.. పవన్ సహాయ నిరాకరణ నేటితో సంపూర్ణం అవుతుంది.