భార్య‌ను అమ్మి స్మార్ట్ ఫోన్ కొన్న భ‌ర్త‌..!

Paloji Vinay
ఓ యువకుడు త‌న భార్య‌ను అమ్మెసి స్మార్ట్ ఫోన్ కొన్న సంఘ‌ట‌న దేశంలో సంచ‌ల‌నం సృష్టించింది. ఒడిసాకు చెందిన ఓ వ్య‌క్తి పెళ్లి అయిన నెలకే రాజ‌స్థాన్‌కు చెందిన ఓ వ్య‌క్తికి త‌న భార్య‌ను అమ్మేశారు. అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తో స్మార్ట్ ఫోన్ కొన్నాడు. జ‌ల్సా ఖ‌ర్చుల‌కు డ‌బ్బుల సంపాదించాల‌ని ఈ దారుణానికి ఒడిక‌ట్టాడు ఆ నీచుడు. ఒడిశాకు చెందిన 17 ఏళ్ల యువ‌కుడు.. 26 ఏళ్లున్న త‌న భార్య‌ను 55 సంవ‌త్స‌రాలున్న వ్య‌క్తికి విక్ర‌యించాడు.
 
   విష‌యం తెలుసుకున్న పోలీసులు  మ‌ధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న రాజస్థాన్ జిల్లా బారన్ నుంచి 26 ఏళ్ల మహిళను రక్షించారు. అలాగే ఆ యువ‌కుడిని అరెస్ట్ చేశారు.  వివాహం చేసుకున్న నెల త‌రువాత త‌న భార్య‌తో క‌లిసి రాజ‌స్థాన్‌లోని ఇసుక బ‌ట్టిలో  ప‌ని చేయ‌డానికి వెళ్లారు. అక్క‌డ భార్య‌ను అమ్మగా వ‌చ్చిన డ‌బ్బుల‌తో స్మార్ట్ ఫోన్ కొన్న యువ‌కుడు జ‌ల్సాలు చేసి తిరిగి త‌న స్వ‌గ్రామానికి వెళ్లాడు. భార్య గురించి యువ‌కుడి కుటుంబ‌స‌భ్యులు బ‌లంగీర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు యువ‌కుడిని అదుపులోకి తీసుకున్నారు.

 త‌న‌ భార్య గురించి యువ‌కుడిని కుటుంబసభ్యులు అడ‌గ‌గా ఆమె తనను వదిలేసిందని చెప్పాడు.. ఇది న‌మ్మ‌ని మ‌హిళ కుటుంబ స‌భ్యులు బ‌లంగీర్ పోలీసుల‌కు కంప్ల‌యింట్ చేశారు. యువ‌కుడి, మ‌హిళ కాల్ రికార్డుల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఆమెను గుర్తించి తీసుకువ‌చ్చారు. యువకుడి కాల్ రికార్డులు పరిశీలించ‌గా భార్య‌ను అమ్మెసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మ‌హిళ‌ను కొన్న వ్య‌క్తి ఆమెను విడిచిపెట్ట‌ను అని చెప్పాడు.  దీంతో బ‌లంగీర్ పోలీసులు భ‌ర్త అమ్మెసిన ఆ మ‌హిళ‌ను అతి క‌ష్టం మీద విడిపించారు. తాను రూ.2 ల‌క్ష‌లు ఇచ్చి మ‌హిళ‌ను కొన్నాన‌ని రాజ‌స్థాన్‌కు చెందిన 55 ఏళ్ల వ్య‌క్తి చెప్పాడు.  అనంత‌రం మ‌హిళ‌ను విక్ర‌యించిన యువ‌కుడిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: