కొడాలిపై ఫస్ట్ టైమ్... ఈ కులం నేత‌లు కుళ్లు పొడిచేశారుగా...!

VUYYURU SUBHASH
కొడాలి నాని....తెలుగుదేశం పార్టీకి అతి పెద్ద తలనొప్పి. అసలు కొడాలి టార్గెట్ చేసినట్లుగా చంద్రబాబు, లోకేష్‌లని మరొకరు టార్గెట్ చేయరనే చెప్పాలి. టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టి....అదే టీడీపీకి కొడాలి చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీలోకి వెళ్ళిన దగ్గర నుంచి నాని మాటల దాడి పెరిగింది. చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక, నాని మంత్రి అయ్యాక పరిస్తితి ఎలా ఉందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
ఓ రేంజ్‌లో బూతులతో చంద్రబాబు, లోకేష్‌లపై ఫైర్ అవుతారు. బూతులు తిడతారని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అయితే కొడాలికి టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తాయి. మొదట్లో కాస్త విమర్శలు మామూలుగానే ఉన్నా, తర్వాత నుంచి టీడీపీ నేతలు కూడా కొడాలి ని బూతులు తిడుతున్నారు. అయితే కమ్మ వర్గానికి చెందిన కొడాలిపై టీడీపీలో ఉండే అదే వర్గానికి చెంది న నేతలు ఫైర్ అవ్వడం తక్కువ. ఇతర వర్గాల నేత లు కొడాలిపై విరుచుకుపడతారు గానీ, కమ్మ వర్గానికి చెందిన టీడీపీ నేతలు కొడాలిపై పెద్దగా ఫైర్ అయ్యేవారు కాదు.
ఏదో దేవినేని ఉమా లాంటి నాయకుడు తప్ప మిగిలిన కమ్మ సీనియర్లు కొడాలి...చంద్రబాబుని తిట్టిన పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. కానీ తాజాగా వైసీపీ శ్రేణులు..టీడీపీ ఆఫీసులపై దాడులు చేయడం..ఆ తర్వాత జరుగుతున్న రాజకీయం నేపథ్యంలో కమ్మ నేతలు దూకుడు పెంచారు. ఇంతకాలం పోనిలే అన్నట్లుగా ఉండిపోయిన నేతలు...స్పందించడం మొదలుపెట్టారు.
అయితే గతంలో కొడాలితో పనిచేసిన సాన్నిహిత్యంతో టీడీపీలోనే కమ్మ నేతలు పెద్దగా స్పందించే వారు కాదు..ఇప్పుడు మాత్రం వారు ఆగే పరిస్తితి కనబడటం లేదు. వరుసగా కొడాలి, వల్లభనేని వంశీలపై ఫైర్ అవుతున్నారు. పరిటాల సునీతమ్మ, జి‌వి ఆంజనేయులు, యరపతినేని, చింతమనేని, బోడే ప్రసాద్, రాజేంద్రప్రసాద్, ధూళిపాళ్ళ లాంటి నాయకులు వారికి కౌంటర్లు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: