త్వరలో 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి..? షబీర్ అలీ సంచలన వ్యాఖ్యలు
దీనిపై రేవంత్రెడ్డి, ఈటల రాజేందర్లు ఒక క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా మేము కలువలేదు. అది మే నెలలో ఓ సందర్భంగా కలిశాం. కలిసిన మాట వాస్తవమే. కలిస్తే ఏమిటంట అని సమాధానం ఇచ్చారు. అందుకు వీరిరువురూ కేటీఆర్ పై మండిపడ్డారు. ఇది ఇలా ఉండగానే కాంగ్రెస్ నేతలు సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ముగిసిన వెంటనే దాదాపు 15 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని.. మాజీ మంత్రి, టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ బాంబు పేల్చారు. టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధమయ్యారని, టీఆర్ఎస్ నాయకులు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితిని అర్థం చేసుకొని కొందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడబోతున్నారని జోస్యం చెప్పారు.
రేవంత్రెడ్డి, ఈటల భేటీని గాంధీభవన్లో గాడ్సేగా టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న తరుణంలో..ప్రగతిభవన్లో తెలంగాణ ద్రోహులు అంటూ కాంగ్రెస్ అందుకు కౌంటర్ వేస్తోంది. అదేవిధంగా ప్రగతిభవన్లో గాడ్సే కొత్త అవతారంగా విశ్రాంతి తీసుకొంటుంది. గాడ్సెకు పెద్ద శిష్యుడు లాంటి అమిత్షాను తరుచూ కేసీఆర్ ఎందుకు కలుస్తున్నారో సమాధానం చెప్పాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈటల, రేవంత్రెడ్డి భేటీపై కేటీఆర్ గాలి మాటలు మాట్లాడారని సీఎల్పీనేత భట్టివిక్రమార్క వెల్లడించాడు. కాంగ్రెస్, బీజేపీలు ఎప్పటికీ కలవబోవని, గాంధీభవన్లో గాడ్సేలకు స్థానం లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఎన్నిక తరువాత ఈటల కాంగ్రెస్లో చేరుతారనే వార్త అసత్యం అని భట్టి తెలిపారు.