ముందస్తు ఎన్నికలు ఖాయమని.. చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని రేవంత్ రెడ్డి మరో బాంబ్ పేల్చారు. సీఎం గా నన్ను చెయ్ అని కేటీఆర్ వెంట పడుతున్నారని... గుజరాత్ ఎన్నికల తో తెలంగా ణ ఎన్నికలు వస్తాయని తే ల్చి చెప్పారు రేవంత్ రెడ్డి. ఆ ఎన్నిక ల్లో కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ రెండుగా చీలి పోయిందని... కెసిఆర్ అనుకూల వర్గం.. వ్యతిరేక వర్గం ఉందన్నారు రేవంత్ రెడ్డి. అనుకూల వర్గం బీజేపీ లో బలంగా ఉందని... అనుకూల వర్గం తోనే దళి త బందు అపించేసుకున్నారని ఫైర్ అయ్యారు.
కేటీఆర్ ఫీల్డ్ మీదికి పోయే అలవాటు లేదని... వాళ్ళ నాయన ఎంపి..ఎమ్మెల్యే టికెట్ లు అమ్ముకున్నారు అనేది ఆయనకి తెలుసు అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. గతంలో వెంకట్ రెడ్డీ అని నాయకుడు టికెట్ కొన్నాడని... పిసిసి చీఫ్ నియామకం చేసేది సోనియా గాంధీ అని తెలిపారు రేవంత్ రెడ్డి. ఆరోపణ చేసేటప్పుడు అన్నం తింటున్న ట్టు మాట్లాడాలని... రాజకీయ నాయకుడు ఎవడైనా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంటాడా..? అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.
కేటీఆర్..ఈటెల..నేను కలిసిన అం టున్నాడని.. వాళ్ళ వాళ్ళు ఎంత మంది కలిశా రు అనేది తెలుసు కోమని చెప్పం డి అని ప్రశ్నిం చారు రేవంత్ రెడ్డి. హరీష్..కేటీఆర్ ఇద్దరు చర్చకు వస్తా రా..? రాష్ట్ర ఆదాయం ఎంటి..? ఎక్కడ ఏం నిధులు వెచ్చిస్తున్నారు అని దానిపై చర్చ కు వ స్తారా..? అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. మేము ఇద్దరం వస్తాం..మీరు మి అధికారులను తీసుకు ని రండి లక్ష 75 వేల కోట్ల బడ్జెట్ లో దళిత బందు కి నిధులు ఎక్కడి నుండి తెస్తారని ప్రశ్నించారు ప్రశ్నించారు.