మెయిన్ టార్గెట్ కొడాలి-వంశీ.. ఇంకా కష్టమే!

M N Amaleswara rao
కలిసికట్టుగా పోరాడటంలో అధికార వైసీపీ వాళ్ళని మించిన వారు లేరని చెప్పాలి. ఆ పార్టీ నాయకులు గానీ, కార్యకర్తలు గానీ జగన్ అంటే చాలు ప్రాణమిచ్చేలా ఉంటారు. ఎలాంటి సందర్భం వచ్చినా...తప్పు అయినా, ఒప్పు అయినా జగన్ కోసం నిలబడతారు. ఏ మాత్రం తడబడకుండా ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారు. అయితే అలా తమకు ఎక్కువ చుక్కలు చూపించే నాయకులని ప్రతిపక్ష టీడీపీ టార్గెట్ చేస్తుంది.
నెక్స్ట్ ఎన్నికల్లో అలాంటి నాయకులకు ఎలాగైనా చెక్ పెట్టాలని, మళ్ళీ గెలవకుండా చూసుకోవాలని చూస్తోంది. ఇదే క్రమంలో తమ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళిన కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు నేతలనీ టీడీపీ గట్టిగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక టీడీపీ టార్గెట్ చేసిన నాయకులు ఎవరో క్లియర్ గా అర్ధమైపోయి ఉంటుంది...మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ఏ స్థాయిలో చంద్రబాబుకు చుక్కలు చూపిస్తారో చెప్పాల్సిన పని లేదు.


ముఖ్యంగా కొడాలి నాని తనదైన శైలిలో బాబుపై విరుచుకుపడతారు. తాజాగా ఘటనల నేపథ్యంలో కూడా కొడాలి ఏ విధంగా టీడీపీకి కౌంటర్లు ఇచ్చారో చెప్పాల్సిన పని లేదు. ఓ రేంజ్‌లో నాని, వంశీలు బాబు, లోకేష్‌లపై ఫైర్ అయ్యారు. అందుకే వీరినే టీడీపీ ఎక్కువ టార్గెట్ చేసింది. పైగా వీరు కమ్మ వర్గానికి చెందిన వారు కావడంతో ఇంకా ఎక్కువగా రగిలిపోతున్నారు. ఆఖరికి పరిటాల సునీతమ్మ లాంటి వారు కూడా వీరిపై ఫైర్ అయ్యారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  టీడీపీలో ఉండగా పరిటాల ఫ్యామిలీతో వంశీకి మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.  


కానీ పార్టీ మారక పరిస్తితులు మారాయి. అయితే ఎప్పుడు సునీతమ్మ వీరి గురించి మాట్లాడలేదు. కానీ తాజా ఘటనలతో ఆమె కూడా...ఆ ఇద్దరినీ ఓడించాలని మాట్లాడారు. కానీ ఎవరు ఎన్ని అనుకున్న...గుడివాడలో కొడాలి నానీని, గన్నవరంలో వల్లభనేని వంశీని ఓడించడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: