సింగపూర్‌లో ఈటల ఎన్నికల ప్రచారం.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్య‌లు

N ANJANEYULU
హుజూరాబాద్ ఉప ఎన్నిక బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ సింగ‌పూర్‌లో ప్ర‌చారం నిర్వ‌హించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను కేసీఆర్ వెన్నుపోటు పొడిచాడ‌ని.. న‌న్ను బ‌య‌టికి పంపించి ద్రోహం చేశాడ‌ని పేర్కొన్నాడు. కేసీఆర్ నా క‌ళ్ల‌లో మ‌ట్టి కొట్టాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 18 సంవ‌త్స‌రాల పాటు తెలంగాణ ఉద్య‌మంలో వాడుకొని కేసీఆర్ తెలంగాణ వ‌చ్చిన త‌రువాత త‌న‌ను బ‌య‌టికి పంపాడ‌ని ఈట‌ల సంచ‌ల‌న కామెంట్లు చేశారు.
హుజూరాబాద్‌లో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే టీఆర్ఎస్‌కు డిపాజిట్ కూడ ద‌క్క‌ద‌న్నారు. మేము ఎవ‌రి జోలికి వెళ్ల‌ము. మా జోలికి ఎవ‌రూ రావ‌ద్దు. వ‌స్తే ఊరుకోం. ఎన్నిక‌ల త‌రువాత సిద్ధిపేట‌కు వ‌స్తాన‌ని, మీ స‌త్తా ఏందో.. నా స‌త్తా ఏందో అనే తేల్చుకుందాం అని చెప్పారు.  ఈరోజు న‌న్ను సింగ‌పూర్‌లో అడ్డుకోవ‌చ్చు కానీ.. మేము త‌ల‌చుకుంటే ఎక్క‌డ అడుగుపెట్ట‌లేర‌ని పేర్కొన్నారు. ఉత్త‌గనే ఊడిప‌డ‌లేదు నేను..  నా మీటింగ్ కు రావ‌ద్ద‌ని బెదిరిస్తున్నారు. నీ అబ్బ‌జాగీరా కేసీఆర్ అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.  
తెలంగాణ ప్ర‌జ‌ల జాగీరు అని, నువ్వు ఓన‌ర్ కాదు కేవ‌లం కాప‌లాదారుడివి. ద‌ళితుల మీద ప్రేమ ఉంటే క‌లెక్ట‌ర్ల‌, బ్యాంకు మేనేజ‌ర్ల పెత్త‌నం ఉండొద్దు. వెంట‌నే ద‌ళిత బంధు ఇవ్వాల‌ని బీజేపీ ఇప్ప‌టికే కేసు వేసింద‌ని గుర్తు చేశారు. దొంగ లేఖ‌లు సృష్టించి త‌ప్పుడు ప్ర‌చారం చేప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. పోచ‌మ్మ‌గుడికి ర‌మ్మంటే ఎవ‌రు రాలేదు.. అనుమ‌తి లేద‌ని అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు పోలీసులు. ఇది మంచిప‌ద్ద‌తి కాదు.  ఈవిష‌యంపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు ఫిర్యాదు చేస్తాను అని ఈట‌ల చెప్పారు. త‌న‌ను గెలిపిస్తేనే కేసీఆర్ మెడ‌లు వంచి ప‌ని చేయిస్తాన‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఒక్కో ద‌ళిత కుటుంబానికి రూ.60ల‌క్ష‌లు రావాల్సి ఉంద‌ని, కేవ‌లం ద‌ళిత బంధు ద్వారా రూ.10ల‌క్ష‌లు ఇస్తున్నార‌ని ఆరోపించారు. రాష్ట్ర ఖ‌జానా అంతా ఖాళీ అయింద‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: