ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మప్రమాణం
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్గా వాసిరెడ్డి పద్మ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ మహిళా స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత వాసిరెడ్డి పద్మతో ప్రమాణస్వీకారం చేయించారు. తాడేపల్లిలోని సీసీ కల్యాణమండలంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సభాపతి తమ్మినేని సీతారాంతో పాటు పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు.
మహిళల భధ్రత సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ ముందు ఉంటున్నారు. దాదాపు రెండున్నర ఏండ్ల కాలంలో మహిళలు తమ కాళ్లమీద నిలబడేలా ఈ సందర్భంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్గా ఎటువంటి పక్షపాతం గాని..రాగద్వేషాలు గాని లేకుండా చిత్తశుద్ధితో తన విధులు నిర్వహిస్తానని పద్మ ప్రమాణస్వీకారం చేపట్టారు. బాధ్యతలు నిర్వహించడంలో ఎటువంటి భయాలకు తలొగ్గనని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళల భద్రత సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ ముందు ఉన్నారని, దాదాపు రెండున్నర ఏండ్ల కాలంలో మహిళలు తమ కాళ్ల మీద నిలబడేలా చేశారని పేర్కొన్నారు.
మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. స్పందన మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులకు న్యాయం జరుగుతోందని వెల్లడించారు. మహిళలకు పెద్దపీట వేసినందుకే సీఎం జగన్పై ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడుతున్నారని వివరించారు. ఇదే జగన్పై జరుగుతున్న కుట్ర అన్నారు. మహిళలకు పెద్దపీట వేసినందుకే కందుకూరు, మహాత్మపూలే, అంబేద్కర్లకు ఎదురుదెబ్బ తగిలింది. రాళ్లతో, చెప్పులతో కొట్టారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో గర్భీణీలకు ఏ సమస్యలు వచ్చినా మహిళా కమిషన్ అండగా ఉంటుందని వెల్లడించారు. మహిళా హోంమంత్రిపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి సరైనవేనా అని టీడీపీ నాయకులపై దుమ్మెత్తిపోశారు.
వైఎస్సార్సీపీ ఏర్పడిన నాటి నుంచి ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు. జగన్ వెన్నంటే ఉన్న నేతల్లో ఆమె ఒకరు. పార్టీ కోసం ఆమె చేసిన సేవలను గుర్తించి సీఎం జగన్ ఆమెకు కీలక పదవీని అప్పగించారు. జగన్తో పాటు తాను అన్నట్టుగా వాసిరెడ్డి పద్మ పలు సమస్యలపై పోరాడారు. ఆమెకు మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవీ దక్కడం సంతోషంగా ఉందని పలువురు వైసీపీ నేతలు ప్రశంసిస్తున్నారు.