జగన్కు దూరం దూరం.. విజయసాయి షాకింగ్ డెసిషన్..!
సరే ఏం జరిగింది అన్నది కాసేపు పక్కన పెడితే ఇప్పుడు విజయసాయి ఉత్తరాంధ్ర పై తన పట్టు తగ్గలేదని నిరూపించుకు నే క్రమంలోనే కొత్త నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నిత్యం ప్రజా దర్బార్ ద్వార ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వస్తున్నారు. విజయసాయి వారంలో ఏకంగా ఐదు రోజుల పాటు ప్రజల్లోనే ఉంటూ ప్రజా దర్బార్ లు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరైనా ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండానే విజయసాయి కలిసే ప్లాన్ చేశారు.
కేవలం విశాఖ నగరమే కాకుండా విశాఖ జిల్లా తో పాటు ఉత్తరాంధ్ర లోని ఏ జిల్లా , ఏ ప్రాంతం నుంచి అయినా ఎవరైనా వచ్చి ఆయనకు సమస్యలు చెప్పుకోవచ్చు. విజయసాయి ప్లానింగ్ బాగున్నా ఆయన దూకుడుతో అక్కడ మంత్రులు , ఎంపీలు , ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోతారన్న చర్చ కూడా ఉంది. విజయసాయి ప్రజా దర్బార్ దెబ్బతో తమ క్రేజ్ తగ్గుతుందని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.ఇప్పటికే ఆరేళ్లుగా ఈ ప్రాంతాన్ని శాసిస్తోన్న విజయసాయి ఇప్పుడు మరింతగా ఇక్కడ పట్టు బిగించేలా ఉన్నారు.