రంగా హ‌త్య త‌ర్వాత .. వైసీపీ ఎమ్మెల్యే వివాస్ప‌ద వ్యాఖ్య‌లు...!

VUYYURU SUBHASH
ఏపీ లో ప్ర‌స్తుత ప‌రిణామాల ప‌ట్ల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీ నేత‌ల దూకుడు పై సాధార‌ణ ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే ఓ చ‌ర్చ న‌డుస్తోంది. ఇలాంటి టైంలో వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ రించాల్సి ఉంది. అయితే తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ  వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు కాంట్ర‌వ‌ర్సీ కి దారి తీస్తున్నాయి. ఆయ‌న పూర్తిగా బ‌రి తెగించేసి ఈ వ్యాఖ్య‌లు చేశారా ? అన్న విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. త‌మ పార్టీ నేత‌ను , ముఖ్య‌మంత్రిని టీడీపీ వాళ్లు తిట్టార‌ని ఆయ‌న కౌంట‌ర్ ఇచ్చినా.. ఆయ‌న మ‌రీ తీవ్రంగా మాట్లాడిన మాట‌లు పార్టీకి మైన‌స్ అయ్యేలా ఉన్నాయి.

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్ రంగా ను హ‌త్య చేసిన‌ప్పుడే తాము కాకినాడ లో టీడీపీ నేత‌ల ఆస్తుల‌ను ధ్వంసం చేశామ‌ని అన్నారు. అప్ప‌ట్లో నే కాకినాడ లో ఐదు రోజుల పాటు క‌ర్ప్యూ విధించార‌ని.. రంగాను చంపితేనే తాము ఊరుకోకుండా.. టీడీపీ వాళ్ల ఆస్త‌ల విధ్వంసం చేశామ‌ని.. అలాంటిది ఇప్పుడు త‌మ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని తిడితే ఊరుకుంటామా ? అని ఫైర్ అయ్యారు.

అస‌లు ప‌ట్టాభి పై కాకినాడ లోనే దాడి చేయాలని అనుకున్నామ‌ని.. అయితే త‌మ అధిష్టానం అలాంటి దాడులు చేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో నే తాము ఆగామ‌న్నారు. కాకినాడ జ‌నాగ్ర‌హ దీక్ష‌లో ద్వారంపూడి మాట్లాడుతూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ , చంద్ర‌బాబు తో పాటు న్యాయ స్థానాల‌పై కూడా విమ‌ర్శ‌లు చేయ‌డం తో అంద‌రూ అవాక్క‌య్యారు. జ‌గ‌న్ ను ఇబ్బంది పెట్టేందుకు చంద్ర‌బాబు కోర్టులను అడ్డం పెట్టుకుంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇక ప‌వ‌న్ పై నువ్వు జనసేన సింహం అయితే చంద్రబాబుకు తొత్తుగా మారకుండా ఒంటరిగా పోటీ చేయాలని సవాళ్లు రువ్వారు. నీ జాతి నిన్ను క్ష‌మించ‌దు అని కూడా ఫైర్ అయ్యారు. ఏదేమైనా ద్వారంపూడి ఇలా కాంట్ర‌వ‌ర్సీ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్ర‌భుత్వానికే ఇబ్బంది అవుతుంద‌ని. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక భావం ఏర్ప‌డుతుంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: