హుజుర్ :కాంగ్రెస్ కు కొత్త టెన్షన్.. ఆ నేతలు ఏమంటున్నారు..!

MOHAN BABU
హుజురాబాద్ బరిలో ఉన్న కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ వచ్చి పట్టుకుందా..? ఇన్నాళ్లు తమ క్యాడర్కు ఓట్లు పడితే చాలు, పరువు దక్కుతుందని భావించిన పార్టీ వర్గాలు ఇప్పుడు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నాయి? ఓటు బ్యాంకుతో పార్టీ నేతలకు వచ్చిన తంటా ఏంటి? హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రచారం మొదలుకొని పాలిటిక్స్ వరకు పోటాపోటీగా నడుస్తున్నాయి. ఈ రెండు పార్టీలు గెలుపు కోసం చేయ్యని ప్రయత్నాలు లేవు. గ్రామ వార్డు స్థాయిలో ప్రభావితం చేసే నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో వారి అంతరంగం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. సమస్య అంతా కాంగ్రెస్ కే వచ్చి పడింది. ఆ సమస్యను తలుచుకొని పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. హుజరాబాద్ లో గడిచిన ఎన్నికల్లో అభ్యర్థి బలాబలాల కంటే కాంగ్రెస్ కు సగటున 35 నుంచి 40 వేల ఓటు బ్యాంకు ఉంది.

2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో 62 వేల ఓట్లు వచ్చాయి. ప్రత్యర్ధి పార్టీల నుంచి బరిలో ఎవరు ఉన్న హస్తం గుర్తుకు డోకా ఉండేది కాదు . ఈ ఉప ఎన్నిక మాత్రం ఆ ధీమా  కల్పించ లేక పోతుందట. కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూర్ వెంకట్ నామినేషన్  వేసిన తర్వాత ప్రచారం లోకి వెళ్లే కొద్దీ గ్రౌండ్ లో పరిస్థితి చూసిన నాయకులకు ఫ్యూజ్ లు ఎగిరిపోతున్నాయట. క్షేత్ర స్థాయిలో ఈక్వేషన్ లు మారిపోతున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీనితో టిఆర్ఎస్, బిజెపి శిబిరాలు రెండు కాంగ్రెస్ క్యాడర్ పై గురిపెట్టాయి. ఈ ఒక్క ఉప ఎన్నికతో కాంగ్రెస్ కు వచ్చే లాభం, నష్టం ఏమీ లేదు కదా అని ప్రశ్నిస్తూ తాయిలాలు విసురుతున్నారట. ఈ ట్రాప్ లో చాలామంది పడినట్లు కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. పోలింగ్ నాటికి మరి కొందరు కూడా ఆకర్షణ వలకు చిక్కుతారనే అనుకుంటున్నారటా. సంప్రదాయ ఓటు బ్యాంకు  ప్రలోభాలకు లొంగి పోతే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వినిపిస్తుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లు వారం రోజులుగా క్యాడర్ తో కలిసి ప్రచారం చేస్తున్నారు.

 పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఇక్కడే ఉండి పార్టీ క్యాడర్కు కొంత నమ్మకం కలుగుతుందని అభిప్రాయ పడుతున్నారు. కాకపోతే హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఆలస్యంగా రంగంలోకి దిగిందనే అభిప్రాయం ఉంది. ఈ ఆలస్యం వల్ల అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నారట. 2018లో కాంగ్రెస్ కు పడిన 62 వేల ఓట్లు మళ్లీ రాలేకపోయినా టిఆర్ఎస్, బిజెపి హోరాహోరి పోరు మధ్య గౌరవప్రదమైన ఓట్లు రాబట్టుకోవాలని చూస్తున్నారు. మరి కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, ఏ మేరకు ఓటు బ్యాంకును కాపాడుకుంటుందో తెలియాలంటే నవంబర్ 2 వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: