కుప్పంలో ఎన్నికల కోలాహలం... వైసీపీ స్పెషల్ ఫోకస్...!
అయితే రాష్ట్రంలో ఎవరిదీ పై చెయ్యి అనేది తేలేది కేవలం ఎన్నికల వల్లే. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించింది. అన్ని జిల్లా పరిషత్ స్థానాలను గెలుచుకుంది. ఇక ఏ ఎన్నిక జరిగినా కూడా మాదే గెలుపు అనేస్తున్నారు. పరిషత్ పోరులో అయితే తెలుగుదేశం పార్టీ తప్పుకుంది కూడా. బద్వేల్ ఉప ఎన్నికల్లో డాక్టర్ సుజాతమ్మకు టికెట్ ఇవ్వడంతో టీడీపీ పోటీలో లేదు. అయితే... వైసీపీ నేతల కళ్లు మాత్రం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై పడింది ఇప్పుడు. తెలుగుదేశం పార్టీని చావు దెబ్బ తీయాలంటే... చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పై చెయ్యి సాధించిన వైసీపీ.... ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీలో వైసీపీ జెండా ఎగుర వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని మునిసిపాలిటీలతో పాటు ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఈ ఏడాది డిసెంబర్ లోపు నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచి కసరత్తు చేస్తోంది.