ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు...!
పట్టాభి ఇంటిపై దాడి చేసిన తర్వాత... అక్కడ కనిపించిన వారందరిపైనా రాడ్లతో దాడి చేశారు. ఇక టీడీపీ కార్యాలయంలో కూడా సిబ్బందిపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఆ తర్వాత ఏకంగా బాంబులేసి లేపేస్తాం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చేశారు. వైసీపీ దాడులకు నిరసనగా... టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నేతలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా జనాగ్రహ దీక్ష పేరుతో రెండు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సమయంలో నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చంద్రబాబు కుప్పం వస్తే కారుపై బాంబు వేస్తామని వైసీపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి అయితే పట్టాభి సంగతి ఇక క్లోజ్ అనేశారు. ఇక కొందలు మంత్రులు అయితే బాబు, లోకేష్ రాష్ట్రంలో ఎలా తిరుగుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. అధినేత చంద్రబాబు ఓ గంట కళ్లు మూసుకుంటే... తామేమిటో చూపిస్తామన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. ఇక మరో నేత అయితే... మేము తలుచుకుంటే డీజీపీ కార్యాలయమే మిగలదు అనేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై ప్రస్తుతం ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.