చంద్రబాబుకి షాక్ ఇచ్చిన షర్మిల...?

Gullapally Rajesh
తెలంగాణా రాష్ట్రం లో వైఎస్సార్ 46 లక్షల పక్కా ఇల్లు కట్టించి ఇచ్చారు అని అన్నారు వైఎస్ షర్మిల. అవుటర్ రింగ్ రోడ్ ప్లాన్ వైఎస్ఆర్ చేసిందే అని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయం వైఎస్సార్ నిర్మించినది అని ఆమె అన్నారు. వాస్తవానికి టీడీపీ అధినేత చంద్రబాబు... విమానాశ్రయాన్ని నిర్మించా అని చెప్తూ ఉంటారు. ఈ తరుణంలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేసారు షర్మిల. 5 ఏళ్ల వైఎస్ పాలన లో ఒక్క రూపాయి కూడ ధర పెంచలేదు అని ఆమె గుర్తు చేసుకున్నారు.
 కేసీఆర్ పాలన మనకు అవసరమా అంటూ నిలదీశారు. శంషాబాద్ లో కనీసం స్ట్రీట్ లైట్ కూడా కనిపించడం లేదు అని  మేము వచ్చామని లైట్ లు ఆపివేశారా అంటూ ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు అన్నారు షర్మిల. అందరినీ కేసీఆర్ మోసం చేశారు అని ఆమె వ్యాఖ్యానించారు. దళిత బందు హుజూరాబాద్ లోనే ఎందుకు అమలు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కి పథకాలు గుర్తుకు వస్తాయి అని మండిపడ్డారు. 111 జీఓ పై కేసీఆర్ మోసం చేశారు అని విమర్శించారు.
ఈ భూములు కొట్టేయడానికి కేసీఆర్ పన్నాగం పన్నారు అని అనుమానం అంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు.  ధరణి పోర్టల్ లో భూములు తారు మారు చేశారు అని మండిపడ్డారు. స్కై వేలు... కడతామని ఎక్కడ కట్టారు అని ఆమె ప్రశ్నించారు. కరోనా వస్తే కేసీఆర్ ఎందుకు యశోదా కి వెళ్ళారు అని ప్రజలు సర్కార్ ఆసుపత్రులకు ...కేసీఆర్ కార్పొరేట్ ఆసుపత్రులకు అంటూ ఎద్దేవా చేసారు. కరోనా తో కేసీఆర్ ఒక్కరిని కూడా ఆదుకోలేదు  అని అన్నారు. ప్రజల పక్షాన తండ్రి కొడుకులు ఎక్కడ నిలబడ్డారు చెప్పాలి అని ఆమె డిమాండ్ చేసారు. మాటలు చెప్పే మొనగాళ్లు కేసీఆర్ ,కేటీఆర్  అని ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: