లోకేశ్ అధికారం కోసం చంద్రబాబు చేతబడి.. పేర్నినాని ఆసక్తికర వ్యాఖ్యలు..!
కాంగ్రెస్ పాలనలో విసుగు చెందిన ప్రజలకు మంచి పాలన అందించేందుకు ఆ మహానీయుడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాడు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. నేడు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేందుకు అల్లరిమూకలను పెంచిపోషిస్తున్నాడు. తన అల్లరిమూకాలను కేంద్ర హోంమంత్రి అమిత్షా వద్దకు ఎగదోలినప్పుడు ఆర్టికల్ 356 గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు దొంగదీక్షకు కబ్జాకోరులు మాత్రమే మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. బూతుల కోసం దీక్షలు చేసేవాని అంత పనికిమాలిన వాడు ఎవడు ఉండడని నాని చంద్రబాబుపై ఆగ్రహం అయ్యారు.
ఒక జాతీయ పార్టీకి అధినేతవు అయి ఉండి బూతులను సమర్థిస్తావా అని ప్రశ్నించాడు. ఇలా మాట్లాడవద్దని సర్థి చెబితే ఇంత దాక వచ్చేదా అని పేర్కొన్నారు. రౌడిమూకలతో మళ్లీ అవే మాటలు మాట్లాడిస్తున్నావు. మా నాయకుడు ఏమి అనకుండా ఆగుతున్నారు కాబట్టే నీ ఆగడాలు సాగుతున్నాయి. కొంగజపాన్ని మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ కుట్రలకు, కుతంత్రాలకు, మోసాలకు, బూతులకు పెద్ద ఫ్యాక్టరీగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాబి మాట్లాడిన మాటలు కచ్చితంగా రాసిచ్చినవేనని ఎద్దేవా చేశారు. లోకేశ్ అధికారం కోసం చంద్రబాబునాయుడు చేస్తున్న చేతబడి ఇది. రాష్ట్రంలో ఇంతటి అలజడికి కారణం చంద్రబాబు అని.. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు చంద్రబాబు ప్లెక్సీలపై చెప్పులతో కొడుతున్నారని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో కూడ వైసీపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు మంత్రి నాని.