రేవంత్ జూమ్ మీటింగ్.. హుజురాబాద్ టార్గెట్?

praveen
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. హుజరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది..  అదే సమయంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికార టీఆర్ఎస్కు షాక్ ఇచ్చి తమ సత్తా చాటాలని బిజెపి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అయితే వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మరోసారి కాంగ్రెస్ బలోపేతానికి హుజురాబాద్ నుంచి అడుగు వేయాలని కొత్త అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఎంతో వ్యూహాత్మకంగానే ముందుకు సాగుతున్నారు.

 ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరికి వారు తమదైన శైలిలో ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు టీ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన నాటి నుంచి ఎంతో దూకుడుగా ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి..  హుజరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలందరూ చేయాల్సిన పనుల గురించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి

 ఇక ఇటీవలె హుజురాబాద్ ఎన్నికల సమన్వయకర్తలు, ఇన్చార్జి లతో జూమ్ మీటింగ్ లో మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిరుద్యోగ యువత విద్యార్థులను కొత్త ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రచార రంగంలో దూసుకుపోవాలని సూచించారు. ఇక వచ్చే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచార వ్యూహాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు విద్యార్థి నేతకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన విషయం తెలిసిందే. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్కు ఓటు ఎందుకు వేయాలి బిజెపి టిఆర్ఎస్ లకు ఎందుకు వేయకూడదు అన్నది స్పష్టంగా వివరించాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక బీజేపీ టీఆర్ఎస్ చేస్తున్న అన్ని పనులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ కాంగ్రెస్ వైపు వచ్చేలా  చూడాలని సూచించారు రేవంత్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: