రంగంలోకి జూనియర్... చంద్రబాబు నయా స్కెచ్..!
ఇప్పుడు మరో మాష్టర్ స్కెచ్ చంద్రబాబు వేసినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానంతో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్. 2009 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయితే సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ.... తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీపై మాత్రం అభిమానం అలాగే ఉంచుకున్నారు. అయితే తాజాగా టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి జరగడం... అలాగే హిందూపురంలోని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటిపై దాడికి యత్నించడం కూడా ఇప్పుడు తీవ్రంగా పరిగణిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇదే విషయంపై నందమూరి అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో పార్టీకి అండగా ఉండాలంటూ... జూనియర్ ఎన్టీఆర్తో చంద్రబాబు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ రాక కోసం పార్టీలో ఎంతో మంది నేతలు... ఎన్నో రోజులుగా గోల గోల చేస్తున్నారు కూడా. దీంతో ఇదే సరైన సమయం అని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారు. 36 గంటల పాటు నిర్వహించే దీక్షకు మద్దతు తెలిపే విషయంపై కూడా చంద్రబాబు, జూనియర్ మధ్య చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం.