మా ఎన్నికలు : బండి పవన్ మధ్య గ్యాప్ ?
అయితే ప్రకాశ్ రాజ్ కు పవన్ కళ్యాణ్ మద్దత్తు ఇవ్వడం పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ప్రకాశ్ రాజ్ అనేక సార్లు సోషల్ మీడియా ద్వారా పోస్టు లు పెట్టేవాడు. దీంతో ప్రకాశ్ రాజ్ ను జాతియ వాద వ్యతిరేకి అని బండి సంజయ్ తో పాటు బీజేపీ నాయకులు కూడా అంటారు. అలాంటి వ్యక్తి కి బీజేపీ మిత్ర పక్ష మైన జనసేన అదినేత మద్దత్తు ఇవ్వడం పై బండి సంజయ్ అభ్యంతరం తెలిపాడని సమాచారం. ఈ ఎన్నికలతో బండి సంజయ్ కి పవన్ కళ్యాణ్ మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వార్త ల కు బలం చేకురేలా మా ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపు పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు నిదర్శనం అని అంటున్నారు. ఇది జాతీయ వాద వ్యతిరేక శక్తుల ఓటమి అని ప్రకాశ్ రాజ్ ఓటమి ని అభివర్ణిస్తు బండి సంజయ్ అన్నారు. ఈ మా గొడవలు ఇంకా ఎంత వరకు దారి తీస్తాయో చూడాలి మరి