ఉత్తరఖండ్ బీజేపీ కి షాక్ ! పార్టీ మారిన మంత్రి
అయితే ఉత్తర ఖండ్ లో అధికారం లో ఉన్న బీజేపీ కి ఆ పార్టీ మంత్రి షాక్ ఇచ్చాడు. ఉత్తర ఖండ్ రాష్ట్ర ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి పదవి భాద్యతలు నిర్వహిస్తున్న యశ్ పాల్ ఆర్య తన పదవి రాజానామా చేశారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరాడు. అలాగే యశ్ పాల్ ఆర్య కుమారుడు నైనిటాల్ అసెంబ్లి నియోజక వర్గం ఎమ్మెల్యే సంజీవ్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. అయితే యశ్ పాల్ ఆర్య గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కే ప్రాతినిథ్యం వహించే వాడు. అంతే కాకుండా 2007 నుంచి 2014 వరకు ఉత్తర ఖండ్ కాంగ్రెస్ పార్టీ కి చీఫ్ గా కూడా ఉన్నారు. చాలా రోజుల తర్వాత మళ్లి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో చేరాడు. అయితే యశ్ పాల్ కాంగ్రెస్ లో చేరడం పై ఉత్తర ఖండ్ కాంగ్రెస్ ముఖ్య నాయకులు హరీష్ రావత్, రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణు గోపాల్ హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సంవత్సరం రాబోతున్న జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని దీమ వ్యక్తం చేశారు.