మా పోరు : రోజా మ‌ద్ద‌తు ఎవ‌రికంటే?

RATNA KISHORE
మీడియా ఎదుట న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడ‌డం తెలివి.. ఆ తెలివి కార‌ణంగానే రోజా నెట్టుకువ‌స్తున్నారు గ‌త కొద్ది కాలంగా.. ఇప్పుడూ అదే చేశారు.. మా ఎన్నిక‌ల్లో త‌న మ‌ద్ద‌తు ఎవరికి అన్న‌ది చెప్ప‌క‌పోయినా సంబంధిత సంకేతాలు మాత్రం మంచు వారింటి వార‌సుడికే అని తేల్చేశాయి.  అంతేకాదు త‌మ అధినేత, రాజకీయ జీవితాన్ని మ‌లుపు తిప్పిన జ‌గ‌న‌న్న మాట కూడా ఇదే!

అండ్ ద విన్న‌ర్ ఈజ్ .. ఈ ఎనౌన్స్ మెంట్ మ‌రికొద్ది గంట‌ల్లో రానుంది. విష్ణు రాణిస్తాడా లేదా ప్ర‌కాశ్ రాజ్ గెలుపు సాధిస్తాడా అన్న‌ది కూడా తేలిపోనుంది. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ నేరుగా లేరు కానీ ఉన్నారు. కేటీఆర్ నేరుగా లేరు కానీ ఉన్నారు. బాల‌య్య నేరుగానే ఉన్నారు. త‌న మ‌ద్ద‌తు పై ఎప్పుడో స్ప‌ష్ట‌త ఒక‌టి ఇచ్చేశారు కూడా! బాల‌య్య బాట‌లోనే రోజా కూడా వెళ్ల‌నున్నారు. త‌మ అధినేత మ‌ద్ద‌తు ఎవ‌రికి అన్న‌ది ఇప్ప‌టికే సుస్ప‌ష్టం క‌నుక ఆ విధంగా రోజా మేడ‌మ్ కూడా ముందుకు పోయి, రేప‌టి వేళ ఓటేసి రానున్నారు అని తెలుస్తోంది. ఇది ఊహ‌జ‌నిత ప్రతిపాద‌న మాత్ర‌మే!

చిత్తూరు రాజకీయాల్లో రాణిస్తున్న రోజా గ‌త కొద్దికాలంగా పెద్ద‌గా సినిమా రాజకీయాల్లో వేలు పెట్ట‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. అవును! ఆమె కేవ‌లం ఈటీవీ - మ‌ల్లెమాల సంయుక్తంగా నిర్వ‌హించే ప్రొగ్రాంల‌కు త‌ప్ప ఇంకా ఏ ఇత‌ర కార్య‌క్ర‌మాల‌కు ఆమె హాజ‌రు కావ‌డం లేదు కూడా! టెలివిజ‌న్ మాధ్య‌మం అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని మ‌రో మారు చెప్పారు కూడా ఆ మ‌ధ్య‌! అందుకే ఈ మాధ్య‌మాన్ని తాను వీడిపోన‌ని కూడా అన్నారు. ఇప్పుడు మా ఎన్నిక‌ల కార‌ణంగా త‌న‌ను విసుగెత్తించే ప్ర‌శ్న‌లు అడ‌గ కూడ‌ద‌ని కండీష‌న్ పెట్టారు రోజా..దీంతో మీడియా సైలెంట్ అయిపోయింది.

మ‌రి! ఈ ఎన్నిక‌ల్లో ఆమె మ‌ద్ద‌తు ఎవ‌రికి? కొంత ఊహాజ‌నితంగా ఉన్నా ఆమె మ‌ద్ద‌తు మాత్రం విష్ణు కే ఉంటుంది. ఎందుకంటే జ‌గ‌న్ నేరుగా కాక‌పోయినా తెర వెనుక అయినా ఆయ‌న కోసం, ఆయ‌న గెలుపు కోసం ప‌రిత‌పిస్తున్నార‌న్న‌ది నిజం. ఆ విధంగా ఇండ‌స్ట్రీపై పట్టు కోసం జ‌గ‌న్ ప‌రిత‌పిస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. ఆ ప‌రి త‌ప‌న లేదా అతి త‌ప‌న‌లో భాగంగా విష్ణు గెల‌వాల‌న్న‌దే ఆయ‌న కోరిక మ‌రియు ఆశ కూడా! ఈ సంద‌ర్భంలో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగానే రోజా ఉంటారు. రోజా బ‌య‌ట‌కు ఆ మాట చెప్ప‌క‌పోయినా రేప‌టి వేళ జ‌రగ‌నున్న‌దే అది.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa

సంబంధిత వార్తలు: