యోగీ సర్కార్కు కోలుకోలేని దెబ్బ..!
అయితే ఇప్పుడు లఖింపూర్ ఖేరి ఘటన భారతీయ జనతా పార్టీ ఇమేజ్ను బాగా డ్యామేజ్ చేసినట్లుగా ఉంది. రైతులపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటనలో జరిగిన దాడి... దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే యూపీలో అధికారంలో ఉన్న యోగీ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కరోనా సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో... లఖింపూర్ ఖేరి ఘటన... టెరాయ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. రైతులపై దాష్టికం చేయడంపై విపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా ప్రియాంకా గాంధీని పోలీసులు నిర్భందించారు. ఇక మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిని ఎయిర్ పోర్టులోనే అడ్డుకున్నారు. దీంతో ఈ ఆరు జిల్లాలో కూడా బీజేపీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయినట్లుగా ఉంది. ప్రస్తుతం టెరాయ్ ప్రాంతంలోని ఆరు జిల్లాలో పరిస్థితులు అదుపు తప్పేలా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి.