పథకాల పేర్లపై వార్... వైసీపీని నిలదీస్తారా...!
ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... పాత ప్రభుత్వ పథకాల పేర్లను పూర్తిగా మార్చేసింది. చివరికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కూడా పేర్లు మార్చడంతో ఇప్పుడు అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిధులు కేటాయించే స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పేరు పెట్టేశారు ప్రభుత్వ పెద్దలు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కోసం 4 వేల 97 చెత్త సేకరణ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ పథకానికి జగన్ పేరు చేర్చడంపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ము కేంద్రానికి... సోకు రాష్ట్రానిదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రధాని మోదీ సర్కార్ డబ్బులు ఇస్తోంటే... ప్రభుత్వం మాత్రం పథకాలకు సొంత పేర్లు పెట్టుకుంటోదని ఆరోపించారు.