వైసీపీలో ఆ ఇద్ద‌రు నానీలు ఇంకా సర్దుకోవచ్చా...?

VUYYURU SUBHASH
ఇక వైసీపీ ప్రభుత్వంలో హడావిడి చేస్తున్న మంత్రులు పేర్ని నాని, కొడాలి నానిలు సైలెంట్ అవ్వనున్నారా? మంత్రివర్గంలో మార్పులు జరిగిన తర్వాత నానీల సందడి తగ్గనుందా? అంటే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు జగన్ ప్రభుత్వంలో పేర్ని నాని, కొడాలి నానిలు ఎంత హడావిడి చేశారో అందరికీ తెలుసు. ఈ ఇద్దరు మంత్రులు తమ శాఖల పరంగా ప్రజలకు ఎంత ఉపయోగపడ్డారో తెలియదుగానీ, ప్రతిపక్ష పార్టీలని ఇష్టారాజ్యంగా తిట్టి జగన్‌కు మాత్రం బాగా ఉపయోగపడ్డారు.
కొడాలి ఏమో చంద్రబాబుని ఎన్ని రకాలుగా తిడుతూ వచ్చారో అందరికీ తెలుసు. అసలు కొడాలి మీడియా సమావేశం పెడుతున్నారంటే చాలు....బాబుపై బూతుల వర్షం కురుస్తుందని అందరికీ అర్ధమైపోతుంది. అంటే ఆ స్థాయిలో కొడాలి, బాబుపై విరుచుకుపడేవారు. ఇటు పేర్ని కూడా వెటకారంగా బాబుని ఎన్ని సార్లు విమర్శలు చేశారో కూడా తెలిసిందే. అలాగే పవన్ కల్యాణ్‌పై ఎలాంటి విమర్శలు చేస్తున్నారో కూడా అంతా చూస్తున్నారు. అసలు పవన్ కోసమే....పేర్ని మంత్రి అయ్యారా? అన్నట్లుగా పరిస్తితి నడుస్తోంది.
ఇలా చంద్రబాబు, పవన్‌లని టార్గెట్ చేసి రాజకీయం చేస్తున్న పేర్ని, కొడాలి సందడి కొన్ని రోజుల తగ్గనుందని తెలుస్తోంది. ఎలాగో జగన్ 100 శాతం మంత్రివర్గాన్ని  మార్చడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఇప్పుడున్న అందరూ మంత్రులు దుకాణం సర్దుకోవచ్చు. అలాగే పేర్ని నాని, కొడాలి నాని లు కూడా సైడ్ అయిపోతారు.
ఇక వారి స్థానాల్లో వచ్చే మంత్రులు ఏ స్థాయిలో చంద్రబాబు, పవన్‌ని టార్గెట్ చేస్తారో మున్ముందు చూడాలి. కాకపోతే పేర్ని, కొడాలిలు మాత్రం కాస్త సైడ్ అవుతారు. అంటే ఇక వారు ఎమ్మెల్యేలుగా రాజకీయం చేయాలి. అప్పుడు కూడా కొడాలి, పేర్నిలు మీడియా సమావేశం పెట్టి హడావిడి చేస్తారో లేదో చూడాలి.ఏ విషయం అనేది మరికొద్ది రోజుల్లో నే తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: