ప్రగతి భవన్... అవినీతి భవన్ గా మారింది ?

Veldandi Saikiran
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావుకు మరో బహిరంగ లేఖ రాశారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ‘కెసిఆర్ జమానా -అవినీతి ఖజానా’... అని సకల జనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు? దీనికి మీ జవాబు ఏమిటి? అని నిలదీశారు బండి సంజయ్‌ కుమార్‌.  కెసిఆర్‌ మీరు ఉంటున్న ప్రగతి భవన్‌..... ‘అవినీతి భవన్’గా, ‘తెలంగాణ ద్రోహులకు నిలయం’గా మారింది అన్నది వాస్తవం? దీనికి  మీ సమాధానం ఏమిటి? అని నిప్పులు చెరిగారు బండి సంజయ్‌. 

 

దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కెసిఆర్ అని పేరుంది... దీనికి మీరు స్పందించి, మీ నిజాయితీని, సచ్ఛీలతను నిరూపించుకొంటారా? 2014లో మీరు ముఖ్యమంత్రి పదవి చేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత? మీ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన వాస్తవం నిజమా కాదా? దీనిపై చర్చకు మీరు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు బండి సంజయ్‌ కుమార్‌.  కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైన్ పేరిట అంచనాలు పెంచి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మీరు కొల్లగొట్టారా లేదా? అని ప్రశ్నించారు బండి సంజయ్‌.  

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, విద్యుత్ ప్రాజెక్టుల, విద్యుత్ కొనుగోళ్లు, ప్రభుత్వ భూములు అమ్మకాల్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, వీటికి సంబంధిచిన ఫైల్స్, సంబంధిత పత్రాలు అఖిలపక్షం ముందు పెట్టి దీనిపై చర్చించడానికి మీరు ముందుకు వస్తారా? అని సవాల్‌ విసిరారు బండి సంజయ్‌.  కేసీఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఓటుకు – నోటు పథకాన్ని ప్రవేశపెట్టి మీరు సంపాదించిన కోట్ల రూపాయల అక్రమ సొమ్ముతో సాధారణ ఎన్నికలు, ఉపఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నమాట వాస్తవం కాదా ? అని ప్రశ్నించారు బండి సంజయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: