రోజాని రౌండప్ చేస్తున్నారుగా...భాను రెడీగా ఉండు...

M N Amaleswara rao
ఫైర్ బ్రాండ్ రోజాకు కష్టాలు పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. ప్రత్యర్ధులు కంటే సొంత పార్టీ వాళ్లే రోజాని రౌండప్ చేసి దెబ్బకొట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమెని ఎలాగైనా నగరి నుంచి సైడ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు పర్యాయాల నుంచి రోజా స్వల్ప మెజారిటీ తేడాలతో నగరిలో గెలుస్తూ వచ్చారు. అయితే మొదటి సారి గెలిచినప్పుడు వైసీపీ అధికారంలో లేదు. అయినా సరే ఆమె వైసీపీ తరుపున ఎలాంటి పోరాటాలు చేశారో అందరికీ తెలుసు. అప్పుడు అధికారంలో ఉన్న టి‌డి‌పి వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో కూడా తెలిసిందే.


అందుకే రెండోసారి ఆమె మళ్ళీ గెలవగలిగారు. ఈ సారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రోజాకు తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అధికారంలోకి వచ్చిన ఆమెకు పెద్ద సంతోషం ఉన్నట్లు లేదు. అది కూడా సొంత పార్టీ నేతల వల్లే ఆమెకు బాగా ఇబ్బంది అయిపోతుంది. నగరిలో రోజాకు వ్యతిరేకంగా గ్రూపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా చక్రపాణి రెడ్డి రోజాకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. మొదట నుంచి ఈయనతో రోజాకు ఇబ్బందిగానే ఉంటుంది.
తాజాగా ఎంపీపీ ఎన్నికల సమయంలో కూడా చక్రపాణిరెడ్డి సెపరేట్‌గా తన గ్రూపుతో రోజాకు చెక్ పెట్టడానికి చూశారు. దీంతో రోజా...మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినా సరే నగరిలో ఆధిపత్య పోరు తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే రోజాకు వ్యతిరేకంగా గ్రూపు నడిపేదే పెద్దిరెడ్డి అని ప్రచారం జరుగుతుంది. అసలు ఈ గ్రూపు తగాదాలే రోజా కొంపముంచేలా ఉన్నాయి.
అయితే ఇలా వైసీపీలో ఇంత జరుగుతున్నా కూడా దాన్ని ఉపయోగించుకుని టి‌డి‌పి నేత గాలి భాను ప్రకాష్ బలపడలేకపోతున్నారు. ఇలాంటి సమయంలోనే ఎదగాల్సిన అవసరముంది. కానీ భాను ఆ విధంగా ముందుకెళ్లడం లేదు. ఇకనుంచైనా భాను దూకుడుగా ఉంటే వైసీపీలో ఉన్న ఆధిపత్య పోరు టి‌డి‌పికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: