కాంగ్రెస్లో `దళితబంధు` చిచ్చు..?
ఇప్పటికే రైతుబంధు, రైతు భీమా ఇతర పథకాల ద్వారా టీఆర్ఎస్ ఓటు బ్యాంకును పెంచుకుంది. ఈ క్రమంలో మిగతా వారిని తమవైపునకు తిప్పుకోవడం కోసం వ్యూహాలు రచిస్తోంది అందులో భాగంగానే ఎస్సీ సామాజిక వర్గాల ఓట్టను ఒడిసి పట్టుకోవడం కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కో కుటుంబానికి 10 లక్షలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ తర్జనబర్జన పడుతోంది.. ప్రభుత్వం తీసుకున్న దళితబంధు కాంగ్రెస్ను డైలమాలో పడేస్తోంది. దళితబంధు పై ఎటు తేల్చలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ వాదనల్లో సీఎల్పి భట్టి విక్రమార్క దళితబంధుకు అనుకూలంగా వ్యవహరిస్తూ, దేశంలో దళితులకు ఇలాంటి మంచి పథకం ఇంకోటి లేదని వెల్లడిస్తున్నాడు. అయితే, గతంలో సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించాడు. సీఎల్పి నేతగా భట్టి తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ చీఫ్గా బయటకు స్పందించకున్న లోలోపల అసహనంతో ఉన్నాడని తెలుస్తోంది.