కేబినెట్ రేసులో వైసీపీ ఎమ్మెల్సీ... సీనియ‌ర్ల‌కు ద‌డ‌ద‌డ‌..?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ త్వ‌ర‌లోనే త‌న కేబినెట్‌ను విస్త‌రిస్తార‌న్న ప్ర‌చారం ఉంది. ఆయ న ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజునే రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు ఉన్న త‌న కేబినెట్‌ను పూర్తిగా మార్చేస్తాన‌ని చెప్పారు. ఇక రెండున్న‌రే ళ్ల ప‌ద‌వీ కాలం టైం ద‌గ్గ‌ర ప‌డుతూ ఉండ‌డంతో ఇప్పుడు వైసీపీ ఆశావాహులు అంద‌రూ ఎవ‌రికి వారు గా మంత్రి ప‌ద‌వి కోసం లాబీయింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ఇన్ చార్జ్‌, ఎమ్మెల్పీ దువ్వాడ శ్రీనివాస్ పేరు మంత్రి ప‌ద‌వి రేసులో బ‌లంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు అక్క‌డ సొంత పార్టీ నేత‌ల‌కు ద‌డ ద‌డ పుట్టిస్తోంది.

ఎందుకంటే అక్క‌డ మంత్రి ప‌ద‌వి కోసం ఇప్ప‌టికే స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం తో పాటు మాజీ మంత్రి, పార్టీ సీనియ‌ర్ నేత ధ‌ర్మాన ప్ర‌సాద రావు, మ‌రో వైపు తూర్పు కాపు కోటాలో పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. ఇంకా చెప్పాలంటే ఎస్టీ కోటాలో పాల‌కొండ నుంచి వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వ‌స్తోన్న విశ్వ‌న‌రాయి క‌ళావ‌తి లాంటి వాళ్లు రేసులో ఉన్నారు. వీరంద‌రూ ఉండ‌గానే.. వీరి కంటే జూనియ‌ర్ అయిన దువ్వాడ పేరు సైతం కేబినెట్ రేసులో బ‌లంగా వినిపిస్తుండ‌డంతో వీరంతా టెన్ష‌న్ లో ఉన్నారు.

దువ్వాడ ది కాళింగ సామాజిక వ‌ర్గం. జ‌గ‌న్ జిల్లాలో ముందు నుంచి కాళింగ సామాజిక వ‌ర్గాన్ని ప్రోత్స‌హిస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ క్ర‌మంలోనే ఆ వ‌ర్గం నుంచి ఫైర్ బ్రాండ్ గా ఉండ‌డంతో పాటు పార్టీ త‌ర‌పున దూకుడుగా ముందుకు వెళుతోన్న దువ్వాడ‌ను కేబినెట్లోకి తీసుకుంటే జిల్లాలో కాళింగులు అంతా వైసీపీ వైపే ఉంటార‌న్న‌దే జ‌గ‌న్ స్ట్రాట‌జీగా క‌న‌ప‌డుతోంది.

మ‌రోవైపు టెక్క‌లిలో ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఉండ‌డంతో పాటు వైసీపీకి కొర‌క‌రాని కొయ్య‌గా ఉన్న అచ్చెన్నాయుడును ఢీ కొట్టాలంటే దువ్వాడే స‌రైన వ్య‌క్తి అని కూడా జ‌గ‌న్ భావిస్తున్నారు. అందుకే దువ్వాడ‌కు జ‌గ‌న్ ఎక్కువ ప్ర‌యార్టీ ఇస్తున్నారంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: