కేబినెట్ రేసులో వైసీపీ ఎమ్మెల్సీ... సీనియర్లకు దడదడ..?
ఎందుకంటే అక్కడ మంత్రి పదవి కోసం ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం తో పాటు మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు, మరో వైపు తూర్పు కాపు కోటాలో పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి.. ఇంకా చెప్పాలంటే ఎస్టీ కోటాలో పాలకొండ నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తోన్న విశ్వనరాయి కళావతి లాంటి వాళ్లు రేసులో ఉన్నారు. వీరందరూ ఉండగానే.. వీరి కంటే జూనియర్ అయిన దువ్వాడ పేరు సైతం కేబినెట్ రేసులో బలంగా వినిపిస్తుండడంతో వీరంతా టెన్షన్ లో ఉన్నారు.
దువ్వాడ ది కాళింగ సామాజిక వర్గం. జగన్ జిల్లాలో ముందు నుంచి కాళింగ సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఆ వర్గం నుంచి ఫైర్ బ్రాండ్ గా ఉండడంతో పాటు పార్టీ తరపున దూకుడుగా ముందుకు వెళుతోన్న దువ్వాడను కేబినెట్లోకి తీసుకుంటే జిల్లాలో కాళింగులు అంతా వైసీపీ వైపే ఉంటారన్నదే జగన్ స్ట్రాటజీగా కనపడుతోంది.
మరోవైపు టెక్కలిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండడంతో పాటు వైసీపీకి కొరకరాని కొయ్యగా ఉన్న అచ్చెన్నాయుడును ఢీ కొట్టాలంటే దువ్వాడే సరైన వ్యక్తి అని కూడా జగన్ భావిస్తున్నారు. అందుకే దువ్వాడకు జగన్ ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారంటున్నారు.