నెల్లూరు టీడీపీకి ఆయనొక్కరే దిక్కా..!

MOHAN BABU
నెల్లూరు జిల్లా అధికార వైసిపికి కంచుకోట అనే సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఎన్నికల బరిలో దిగిన దగ్గర నుంచి జిల్లాలో టిడిపికి పరాజయాలే  ఎక్కువ వస్తున్నాయి. 2014లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన సరే నెల్లూరులో వైసీపీ హవానే నడిచిం
ది. మొత్తం 10 సీట్లలో వైసిపి 7 గెలిచి సత్తా చాటింది. టిడిపి 3 సీట్లకే పరిమితమైంది. ఇక నెల్లూరు ఎంపీ సీట్లు సైతం వైఎస్సార్ సీపీ ఖాతాలోనే పడింది. ఐదేళ్లు అధికారం లో ఉన్నా కూడా చంద్రబాబు ప్రజల్లో గెలిచిన నేతలను కాదని,  ఎన్నికల్లో ఓడిన సోమిరెడ్డికి,  ఎన్నికల్లో పోటీయే  చేయని నారాయణ కు మంత్రి పదవులు కట్టబెట్టారు. సోమిరెడ్డి చాలా నియోజకవర్గాల్లో గ్రూపులు ఎంకరేజ్ చేయడంతో జిల్లాలో టిడిపి సర్వనాశనం అయిందన్న విమర్శలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసి టిడిపికి గుండుసున్నా మిగిల్చింది. పైగా వైసీపీ అధికారంలోకి రావడంతో జిల్లాలో టిడిపి అడ్రస్ లేకుండా పోతుంది. అసలు ఓడిపోయిన తర్వాత టిడిపి నాయకులు కంటికి కనిపించడం లేదు.

అధికారంలో ఉన్నప్పుడు హడావిడి చేసిన నాయకులు అధికారం కోల్పోగానే ఎవరి పనులు వారు చూసుకుంటున్నారు. జిల్లాకు పెద్దగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం మీడియా సమావేశాలకే  పరిమితమై పోయారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కోవూరు,  నెల్లూరు రూరల్, సూళ్లూరుపేట, వెంకటగిరి,  ఉదయగిరి నియోజకవర్గంలో చాలా స్థానాలు అధికార పార్టీకి ఏకగ్రీవం అయిపోయాయి అంటే టిడిపి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇక జిల్లా టిడిపిలో ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు,  ఎమ్మెల్సీ బీదా రవిచంద్రయాదవ్ ఒక్కడు మాత్రమే యాక్టివ్గా ఉంటూ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక నియోజకవర్గ ఇంచార్జీల   విషయానికి వస్తే జిల్లా టిడిపిలో ఎవరు బయటికి వచ్చినా,  లేకపోయినా నెల్లూరు సిటీ ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాత్రం నిత్యం పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. మొన్న ఎన్నికల్లో సిటీ నుంచి పోటీ చేసి మాజీ మంత్రి నారాయణ,  అనిల్ కుమార్ యాదవ్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓడిపోయాక నారాయణ తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. దీంతో చంద్రబాబు కోటంరెడ్డి ని ఇన్చార్జిగా పెట్టారు. ఇక అప్పటి నుంచి కోటంరెడ్డి దూకుడుగా పని చేసుకుంటున్నారు.

ఓవైపు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూనే,  మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ధైర్యంగా వైసీపీ ప్రభుత్వం పై పోరాడుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నారు. ఆ మధ్య కావలి లో ఎన్టీఆర్ విగ్రహం తొలగించడంపై కూడా గట్టి పోరాటం చేశారు. జిల్లాలో ఏ సమస్య ఉన్నా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విజయవంతం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: