సిగ్గుతో తలదించుకోవాలంటున్న పవన్ కళ్యాణ్..!

NAGARJUNA NAKKA
హైదారాబాద్ సైదాబాద్ లోని హత్యాచార ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందరం తలదించుకోవాల్సిన సమయమని పేర్కొన్నారు. ఈ దారుణమైన ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని.. అందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన పవన్.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మీడియా ఈ అంశాన్ని ఎక్కువ మందికి తెలియజేయాలని సూచించారు.
బాలికపై హత్యాచారం కేసులో పోలీసులు సరిగా స్పందించలేదని బాలిక తల్లిదండ్రులు తనతో చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. తల్లిదండ్రులు రాజుపై ముందే అనుమానం వ్యక్తం చేశారని తెలిపారు. పోలీసులు ఇంత వరకు నిందితుడిని పట్టుకోలేదని.. వేగంగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దోషికి శిక్ష పడే వరకు జనసేన పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఆరేళ్ల చిన్నారిపై హత్యకేసులో నిందితుడు పల్లంకొండ రాజును పట్టిస్తే.. 50వేల  రూపాయలు రివార్డుగా ఇస్తానని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపాడు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే.. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందన్నాడు. అతడు మీ దగ్గర్లోనే ఉండొచ్చని.. ఓ కన్ను వేసి ఉంచాలని చెప్పాడు. ఆ కిరాతకుడిని పట్టుకునే పనిలో పోలీసులకు మనవంతు సాయం అందిద్దామని ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చాడు.
ఇక హత్యాచారం కేసులో నిందితుడు పల్లంకొండ రాజును త్వరగా పట్టుకోవాలనే డిమాండ్ పెరిగిపోతోంది. #wherelspallakondaraju అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా నిందితుడిపై తెలంగాణ పోలీసులు చేసిన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కు రీపోస్ట్ చేసిన హీరో నాని.. బయటెక్కడో ఉన్నాడు ఉండకూడదు అంటూ పోస్ట్ చేశాడు. అటు హీరో మంచు మనోజ్ కూడా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులకు సహకరించాలని ప్రజలను కోరాడు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: