బ్రేకింగ్: బ్యాంకులకు ఏపీ మంత్రి వార్నింగ్
సొసైటీ ల బైఫరికేషన్ , ఇతర మార్పులు చేర్పులు అంశాల్లో ప్రతిపాదనలు చేయండి అని కోరారు. రైతుల డబ్బు ని మనం అత్యంత బాధ్యతగా ఖర్చు చేయాలి అని కోరారు. డీసీసీబీ , డిసిఎంఎస్ , పాక్స్ కు త్వరలో ఎన్నికలొస్తాయి అని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు కౌలు రైతులకు రుణాలు ఇతర సేవలనందించే దిశగా చర్యలు తీసుకోవాలి అని ఆయన సూచించారు. బ్యాంకు ల లావాదేవీలను చెక్ అండ్ బాలన్స్ చేసేలా ఆడిటింగ్ వ్యవస్థ ను పూర్తిగా ప్రక్షాళన చేయాలి అని మంత్రి కోరారు. వ్యవస్థ లో పని చేసే సిబ్బంది కోసం , వ్యవస్థ బలోపేతం కోసం హెచ్ ఆర్ పాలసీ ని సక్రమంగా అమలు చేయాలి అన్నారు.
ఆర్థిక స్థోమత వుండి కూడా రుణాలు తీసుకొని అప్పులు చెల్లించని రుణగ్రస్తుల వద్దనుండి కఠినంగా రికవరీలు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. తొలిదశలో చిత్తూర్ , ప్రకాశం , పశ్చిమ గోదావరి , గుంటూరు, కడప జిల్లాల్లో అముల్ ప్రాజెక్ట్ లకు బ్యాంకుల నుంచి రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. జిల్లాల్లోని బ్యాంకుల్లో పెండింగ్ కేసులు , వాటి విచారణ , అప్కోబ్ , ఆర్ సి ఎస్ , ప్రభుత్వం నుంచి తీసుకున్న చర్యలపై చర్చించిన మంత్రి కన్నబాబు ... డీసీసీబీ బ్యాంకుల చైర్మన్లు రుణాల విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి వత్తిడిలకు తలొగ్గద్దనే సీఎం ఆదేశాలను గుర్తించుకొండి అని సూచించారు.