చైత్ర హత్య: టార్గెట్ కవిత

Sahithya
ఆరేళ్ళ పసికందును ఒక రాక్షసుడు రేప్ చేసి హత్య చేయడం దారుణం అన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ పరువు పోయింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి సీఎం కెసిఆర్, దత్తత తీసుకున్న కేటీఆర్, డమ్మీ హోమ్ మంత్రి మహమూద్ అలీ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాకపోవడం దారుణం అని ఆయన విమర్శలు చేసారు. నిందుతున్ని పట్టిస్తే 10లక్షలు ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదం అన్నారు ఎంపీ.
పోలీసులున్నది గాడిదలు కాయడానికా  అని నిలదీశారు. చిన్నారి మృతికి ఆ రాక్షసుడు ఎంత కారణమో పోలీసులు అంతే కారణం  అని విమర్శించారు. తల్లి పిర్యాదు చేసిన వెంటనే డోర్ ఓపెన్ చేసిఉంటే అమ్మాయి బ్రతికి ఉండేది  అన్నారు. కేటీఆర్ ప్రచారాల మంత్రి, మూర్కుడు అని ఆయన ఆరోపించారు. బతుకమ్మ అంటూ తెలంగాణ అంత తిరిగే కవిత ఇక్కడికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించారు. మానవత్వం ఉంటె కేటీఆర్ ఇక్కడికి రావాలి అని డిమాండ్ చేసారు. దళిత గిరిజన బిడ్డలని రాలేదా, కేటీఆర్ సమాధానం చెప్పాలి అని కోరారు.
వెంటనే దోషులను శిక్షించాలి అని ఆయన డిమాండ్ చేసారు. పోలీసులకు అవార్డు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు, డబ్బులతో అవార్డులు కొనుక్కుంటున్నారు అని విమర్శించారు. దోషులను పెట్టుకోకపోవడం పోలీస్ వ్యవస్థ చేతకానితనానికి నిదర్శనం అన్నారు ఆయన. అమ్మాయి చనిపోయి బాధలో ఉంటె డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పడం బాధాకరం అని ఆరోపించారు. చదువుకున్న కలెక్టర్ మాట్లాడే మాటల ఇవి అని నిలదీశారు. సినీ యాక్టర్ ని పరామర్శించే తలసాని శ్రీనివాస్ ఇక్కడికి ఎందుకురారు అని ప్రశ్నించారు. దిశ టైం లో చేసినట్లే చిన్నారి విషయంలో కూడా వెంటనే శిక్షించాలి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: