జయహో దళిత బంధు : కేసీఆర్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారా?
దళిత బంధు పథకం పై దేశం యావత్తూ ఆసక్తికరంగా చూస్తోంది. ఈ పథకం అమలులో కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు మాత్రం అత్యంత ఆసక్తిదాయకంగానే ఉంటున్నాయి. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా, వాటిని పట్టించుకోకుండా కేసీఆర్ తనదైన పంథా లో దూసుకుపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో తెలంగాణలో ఎటువైపు చూసినా ఈ పథకానికి సంబంధించి చర్చే నడుస్తుంది. ముఖ్యంగా హుజురాబాద్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం అమలుపై ఎన్నో సందేహాలు తొలి రోజుల్లో వెన్నాడాయి. వాటికి కొనసాగింపుగా విపక్షాల ఆరోపణలు తోడయ్యాయి.
ఆరోపణలు ఎలా ఉన్నా కేసీఆర్ అనుకున్న విధంగా ముందుగా నిర్ణయించిన నిబంధనల అనుసారం అర్హుల ఎంపిక ను పూర్తిచేసి అధికారులు సంబంధిత జాబితాలను సీఎంఓకు పంపారు. మొత్తం 24000 మందిని అర్హులుగా తేల్చారని సమాచారం. వీరికి ఒక్కో అకౌంట్ కు పది లక్షల చొప్పున నిధులు ఇవ్వాలని సీఎం సంకల్పించారు. తొలి విడతగా 13వేలు మందికి నిధులు అందించేం దుకు నిర్ణయించి సంబంధిత అకౌంట్లకు బదిలీ చేశారు. కానీ ఈ నిధులు వినియోగంలోనే అసలు మతలబు ఉందని తరువాత తేలిపోయింది. నిధులను ఖర్చు చేసేందుకు వీల్లేదని, అకౌంట్లను ఫ్రీజ్ చేశారు కలెక్టర్. తమ ఆదేశాలు లేనిదే బ్యాంకర్లు లబ్ధిదారులకు నిధులు ఇవ్వకూడదని చెప్పారు.