వాళ్ళ వెంట పడుతున్న బాబోరు...?

Gullapally Rajesh
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు కొన్ని వినూత్న కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడుతున్నది. అయితే ఇప్పుడు ప్రతిపక్షాలతో కలిసి వెళ్లేందుకు కూడా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అనే అభిప్రాయాలు కొంతవరకు వినపడుతున్నాయి రాజకీయంగా పార్టీని ఇన్ని రోజులు గాడిలో పెట్టడానికి చంద్రబాబు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు పక్షాలతో కూడా కలిసి వెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం అనంతపురం జిల్లా అదేవిధంగా చిత్తూరు అలాగే శ్రీకాకుళం విజయనగరం ప్రాంతాల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.
 కృష్ణా జిల్లాలో కూడా వామ పక్షాలతో పొత్తు పెట్టుకుని ముందుకి వెళితే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు వ్యక్తం చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. అంతే కాకుండా కొంత మంది ప్రజల్లో ఆదరణ ఉన్న ఇతర పార్టీల నాయకులను కూడా ఆకర్షించే పనిలో తెలుగుదేశం పార్టీ పడింది అనే భావన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు కూడా గాలం వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులకు అధికారం లోకి వస్తే కొన్ని పదవులు ఇస్తామని హామీ ఇస్తున్నారని నియోజకవర్గం సీటు ఇవ్వక పోయినా సరే ఖచ్చితంగా వారికి ఆ పార్టీ అధికారంలోకి వస్తే లబ్ధి చేకూర్చే విధంగా చేస్తామని అంటున్నారట.
 పార్టీ నాయకుల నుంచి ఫోన్లు కూడా వెళుతున్నాయని సమాచారం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు కూడా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఫోన్లు చేస్తున్నారు అని ప్రధానంగా తులసిరెడ్డి అలాగే మాజీ మంత్రి రఘువీరా రెడ్డి కి ఫోన్ లు ఎక్కువగా చేస్తున్నారని తెలిసింది. మరి మీరు పార్టీలో కి వెళ్తారా లేకపోతే అలాగే ఉంటారా అనేది చూడాలి రఘువీరా రెడ్డి కి నారా లోకేష్ ఫోన్ చేశారు అని కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: