సంగారెడ్డి జిల్లా చౌటకుర్ లో ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్... మరోసారి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు వచ్చాయని దళిత బంధు ప్రకటించాడని.. ఉప ఎన్నికలు వస్తేనే దళిత బంధు వస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ మెడలు వంచి సెప్టెంబర్ 17 ను నిర్వహించేలా చేస్తామని... కేసీఆర్ చేసింది దొంగ దీక్ష అని ఫైర్ అయ్యారు. తెలంగాణ కోసం 1400 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇప్పుడు కేసీఆర్ కుటుంబము లో అందరికి ఉద్యోగాలు వచ్చాయని... టీ ఆర్ ఎస్ తుగ్లక్ పార్టీ, ఎం ఐ ఏం తాలిబన్ పార్టీ అని ఎద్దేవా చేశారు బండి సంజయ్ కుమార్.
ముఖ్యమంత్రి అంబేద్కర్ జయంతి కు, వర్ధంతి లకు రాడు,... దీనిపై దళిత సంఘాలు ఎందుకు ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. ఢిల్లీ లో ఉన్న, ఇక్కడ ఉన్న కేసీఆర్ పీకెది ఏమి లేదని... నిజమైన ఉద్యమకారుడు కాళోజీ అని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్. అయితే ఫార్మ్ హౌస్, లేదంటే ప్రగతి భవన్ లో కేసీఆర్ ఉంటాడని... కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్లు రాష్ట్రానికి ఇస్తుందన్నారు. ఫార్మ్ హౌస్ లో ఉన్న కుక్క కి ఉన్న విలువ పేదలకు లేదా? సచివాలయం కి రాని ముఖ్యమంత్రి కి కొత్త సచివాలయం ఎందుకు ? అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్.
గ్లోబరిన్ సంస్థ వలన ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారని... సీఎం ఎన్నికలు వస్తే కోతలు కోస్తాడు, ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తాడని చురకలు అంటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ది చెబుతారని మండి పడ్డారు బండి సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్రం లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి అసలైన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీనేనని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారమన్నారు.