వాడ్ని పిసికితే చస్తాడు, పొట్టోడు: తలసాని హాట్ కామెంట్స్

Sahithya
తెరాస పార్టీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక విమర్శలు చేసారు. నోటికి ఏదోస్తే అది మాట్లాడటం ఫ్యాషన్ అయింది అంటూ ఆయన విపక్షాలను లక్ష్యంగా చేసుకుని ఆరోపించారు. బూతులు తిడితేనే న్యూస్ అవుతోంది అని అన్నారు మంత్రి. ఎదుటివారు మాట్లాడుతున్నారని మనం ఏదీపడితే అది మాట్లాడటం అవసరం లేదు అని ఆయన స్పష్టం చేసారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయ్యాక హైద్రాబాద్ లో మంచినీటి కొరత లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలి అని హితవు పలికారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లమీద కాంగ్రెసోడు కారు కూతలు కూస్తున్నాడు అని భట్టివిక్రమార్క కు నేను డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు చూపించాను అని ఆయన గుర్తు చేసుకున్నారు. మేము చిల్లరగా ఆలోచిస్తే ఎవరైనా హైద్రాబాద్ లో ఉంటారా అంటూ ఈ సందర్భంగా నిలదీశారు. కేటీఆర్ నే తట్టుకునే శక్తీ మీకు లేదు కేసీఆర్ ను తట్టుకుంటారా అంటూ ప్రశ్నించారు. ఒకడు జైల్ కు పంపుతా అంటున్నారు అన్న ఆయన మా అనుభవం ముందు మీ బ్రతుకెంత అంటూ నిలదీశారు. కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తా అన్నారు మళ్ళీ టిఆర్ఎస్ నే దిక్కయ్యింది అంటూ ఆయన కామెంట్స్ చేసారు.
గ్రేటర్ లో కొందరు కార్పొరేటర్లు ఓడటం మన స్వయంకృతాపరాదం అని ఆయన కామెంట్స్ చేసారు. మల్లారెడ్డి, మైనంపల్లి ప్రతిపక్షాలకు మంచి సమాధానం చెప్పారు అని తలసాని కొనియాడారు. పొట్టిగా గింత ఉన్నోడు పిసుకుతె చస్తాడు అని వాడు కూడా మాట్లాడుతున్నాడు అంటూ ఎద్దేవా చేసారు. బీజేపీ వాడు నేర్పిస్తేనే మేము గుడికి పోతున్నమా అని నిలదీశారు మంత్రి... బీజేపీ కార్పొరేటర్లు గెలిచిన చోట కూడా పనుల కోసం ప్రజలు టిఆర్ఎస్ వద్దకే వస్తున్నారు అని ఆయన ప్రస్తావించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts

సంబంధిత వార్తలు: