కెసిఆర్..తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి ?
కేసీఆర్ నీటి విషయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలనుకుంటున్నారా అన్యాయం చేయాలనుకుంటున్నారా ? కేసీఆర్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ తెలంగాణ నెంబర్ వన్ ద్రోహి అని.. నీటి కోసం తెలంగాణ ఏర్పడిందన్నారు.. ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని.. కృష్ణా ,గోదావరి బోర్డుల సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని డిమాండ్ చేశారు. ఏపీ అక్రమ ప్రాజెక్టుల అంశాలను బోర్డుల ముందుకు తీసుకెళ్లవచ్చని.. బోర్డుల సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని బిజెపి డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.
ఎన్నికలుంటేనే కేసీఆర్ బయటకు వస్తున్నారని..కేసిఆర్ అరాచక పాలన నుంచి ప్రజలు బయట పడాలని తెలిపారు. కేసీఆర్ జైలు కు వెళ్లే విషయంలో మా వ్యూహం.. మాకు ఉందని.. దానిపై జెపి నడ్డా చెప్పారన్నారు. ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్ లో పోడుభూముల్లో వ్యవసాయం చేసుకునే 19మంది మహిళలను కొట్టి హత్యాయత్నం కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు,బాలింతలను అరెస్ట్ చేశారు..మహిళల ఫొటోలను చూసి కేసీఆర్ సిగ్గు తెచ్చుకోవాలని చురకలు అంటించారు. వ్యవసాయం చేసుకునే మహిళలను అరెస్ట్ చేసినందుకు అధికారులపై చర్యలు తీసుకోవాలని..మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు.