జ‌గ‌న్ క్రెడిట్ జ‌బ‌ర్ద‌స్త్ రోజా ఖాతాలోకే ?

VUYYURU SUBHASH
ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌జ‌ల నుంచి సంపాయించుకుంటున్న క్రెడిట్‌ను వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, జ‌బ‌ర్ద‌స్త్ రోజా త‌న ఖాతాలో వేసుకుంటున్నారా ?  ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ఎమ్మెల్యేకీ రాని ఐడియాల‌తో ఆమె దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా?  జ‌గ‌న్ ఆలోచ‌న‌ల ను త‌న వైపు తిప్పుకొని సింప‌తీ సంపాయించుకుంటున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు. రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ అనేక ప‌థ‌కాల‌ను, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా జ‌గ‌న‌న్న పేద‌లంద‌రికీ ఇళ్లు, చేయూత‌, వైఎస్సార్ నేత‌న్న హ‌స్తం.. ఇలా అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో ద‌ళిత వాడ‌ల్లో ర‌హ‌దారులు నిర్మిస్తున్నారు.
అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా.. నేరుగా జ‌గ‌న్ చేప‌ట్టి.. వాటిని వ‌లంటీర్లు, ఇత‌ర ఉద్యోగుల ద్వారా ప్ర‌జ‌ల‌కు చేరువ చేస్తున్నారు. నెల‌నెలా ఇచ్చే పింఛ‌న్ల నుంచి అన్ని ప‌థ‌కాల‌ను కూడా వ‌లంటీర్ల ద్వారానే ద‌ర‌ఖాస్తులుస్వీక‌రిస్తున్నారు ల‌బ్ధిదారు ల‌ను ఎంపిక చేస్తున్నారు. దీంతో త‌మ‌కు ప్రాధాన్యం త‌గ్గిపోతోంద‌ని.. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా తీవ్ర ఆవేద‌న‌, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. `మాకు ప‌నిలేకుండా చేస్తున్నారు` అని.. వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలు ఎవ‌రి ప‌నుల్లో వారు ఉంటున్నారు. ఎవ‌రి సొంత వ్యాపారాలు వారు చేసుకుంటూ.. నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అయితే.. వీరంద‌రికీ భిన్నంగా రోజా మాత్రం.. `స‌మ‌యం` చూసుకుని నియోజ‌క‌వ‌ర్గంలో వాలిపోతు న్నార‌ని అంటున్నారు వైసీపీ సీనియ‌ర్లు.
జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్రారంభించే ప‌థ‌కాల‌కు సంబంధించిన ముంద‌స్తు స‌మాచారం మేర‌కు.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో మ‌కాం వేస్తున్న రోజా.. ఆయా ప‌థ‌కాల‌ను స్వ‌యంగా త‌నే అందిస్తున్నారు.అ దేస‌మ‌యంలో ద‌ర‌ఖాస్తుల‌ను కూడా.. ముందుగానే త‌నే ప‌రిశీలిం చి.. స‌ర్కారుకు పంపుతున్నారు. దీంతో జ‌గ‌న్ ప్రారంభిస్తున్న ప‌థ‌కాల తాలూకు సింప‌తీ అంతా కూడా రోజా త‌న‌ఖాతాలో వేసుకుంటున్నార‌నేది వైసీపీ సీనియ‌ర్ల మాట‌. దీనికితోడు.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున తానే అన్నీ అయి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు మీడియాకు రోజా చెబుతున్న మాట‌లు కూడా వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఆమె నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తట్నేరి దళితవాడ రోడ్డును ప్రారంభించారు. జగనన్న కాలనీలో గృహ నిర్మాణం కోసం  లబ్దిదారులకు వైఎస్సార్ క్రాంతి పథకం ద్వారా  30 వేల రూపాయ‌ల చొప్పున‌ పంపిణీ చేశారు. దీంతో స్థానిక నాయకులు రోజాకు రోజాలతో పూలాభిషేకం చేసి స‌త్క‌రించారు.. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న‌వారు... జ‌గ‌న్ క్రెడిట్‌ను రోజా బాగానే మేనేజ్ చేసుకుని త‌న ఖాతాలో వేసుకుంటున్నార‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: