ప్రగతి భవన్ ను కూల్చేస్తాం..కేసీఆర్‌ను వదిలిపెట్టబోం ?

Veldandi Saikiran
సీఎం కేసీఆర్‌ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ హాట్ కామెంట్స్ చేశారు. ప్రగతి భవన్ ను కూల్చి 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.  2023 తర్వాత లక్ష నాగళ్ళతో దున్ని కేసీఆర్ ఫామ్ హస్ ను బడుగులకు పంచుతామని హెచ్చరించారు.   సీఎం  కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామని... పేర్కొన్న బండి సంజయ్‌.. హుజురాబాద్ లో బైపోల్స్ కాదు.. కేసీఆర్ కు బైయింగ్ ఎలక్షన్స్ అని ఫైర్‌ అయ్యారు. 

 పది కాదు.. ప్రతి దళిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు బండి సంజయ్.  హుజురాబాద్ లో బీజేపీ పార్టీ గెలుపును తెలంగాణ సీఎం కేసీఆర్ అడ్డుకోలేడని స్పష్టం చేశారు.  కేసీఆర్ పై తెలంగాణ సమాజం విశ్వాసం కోల్పోయిందని... ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధిపై కేసీఆర్ కు చితశుద్ది లేదని నిప్పులు చెరిగారు.  పోడు భూముల్లో చేతికొచ్చిన పంటను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు బండి సంజయ్.  ఫారెస్ట్ అధికారులను పంపి పోడు రైతులకు అన్యాయం చేస్తున్నాడని... కుల వృత్తులను నాశనం చేసిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని నిప్పులు చెరిగారు.

 దమ్ముంటే ఈటల బావ మరిది చాటింగ్ పై  విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.  బడుగులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలకు బీజేపీ పార్టీ సిద్ధమవుతోందని చెప్పారు బండి సంజయ్. ఫేక్  ఐడీలు క్రియేట్ చేసి ఫేక్ ప్రచారం చేస్తున్నారని సీఎం కేసీఆర్‌ పై నిప్పులు చెరిగారు.   ప్రగతి భవన్ ముందు 10 వేల డబ్బులతో నిరసన కార్యక్రమం.. ఎస్టీ మోర్చా, యువ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు బండి సంజయ్‌. సీఎం కేసీఆర్‌ ను విడిచి పెట్టె ప్రసక్తే లేదని... కేసీఆర్ కి అసలు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: