ఆ ఇన‌సొంపైన బూతులు వైసీపీ నేత‌ల‌కు విన‌ప‌డ‌లేదా ?

VUYYURU SUBHASH
ఏపీలో టీడీపీ వాళ్ల‌ను తిట్టాలంటే వైసీపీ వాళ్లు జెడ్ స్పీడ్ తో దూసుకు పోతుంటారు. వైసీపీ నేతలు అయినా, అధికార ప్ర‌తినిధులు అయినా, మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా చంద్ర‌బాబును, టీడీపీ వాళ్ల‌ను, లోకేష్‌ను తిట్టాలంటే ఏకి ప‌డేస్తుంటారు. కొడాలి నాని లాంటి వాళ్లు తిడుతుంటే చెవులు మూసుకోవాల్సిందే. ఒక్క నాని మ‌త్ర‌మే కాదు.. చాలా మంది వైసీపీ నేతలు ప‌చ్చి బూతులే మాట్లాడుతుంటారు. టీడీపీ నేత‌ల నుంచి చిన్న విమ‌ర్శ వ‌చ్చినా చాలు వెంట‌నే వైసీపీ వాళ్లు మూక‌లు మూక‌లుగా దిగిపోయి చంద్ర‌బాబు, లోకేష్ ను ఆడేసుకుంటారు. అయితే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు జ‌గ‌న్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నా ఒక్క‌రు కూడా నోరు మెద‌ప‌డం లేదు.

ఎవ‌రో ఒక‌రిద్ద‌రు నేత‌లు అది కూడా చాలా ప‌ద్ధ‌తిగా రాజ‌కీయ స్వార్థంతోనే టీఆర్ ఎస్ విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని అంటున్నారే త‌ప్పా ఏ మాత్రం నోరు పెగ‌ల‌నీయ‌డం లేదు. టీడీపీ నేత‌ల‌పై వాడే ప‌చ్చి బూతుల భాష‌నే వాడ‌డం లేదు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ఇంత ఘాటుగా తిడుతున్నా ఏదో తూతు మంత్ర‌పు కౌంట‌ర్లు ఇచ్చి స‌రిపెట్టుకుంటున్నారు. అది కూడ ఏదో భ‌యం భ‌యంగా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నా.. దొంగ‌. గ‌జ దొంగ అన్నా కూడా ఎవ్వ‌రూ మాట్లాడ‌ని ప‌రిస్థితి. ఆ ప‌చ్చి బూతులు వీరికి ఎంత మాత్రం విన‌ప‌డ‌డం లేదా ? అన్న డౌట్ కూడా ఉంది.

ఇందుకు కార‌ణం ఏంటంటే ఈ నాయ‌కులు అంద‌రికి తెలంగాణ లోనూ.. హైద‌రాబాద్‌లో నూ ఆస్తులు ఉన్నాయి. ఇక్క‌డ నోరు మెదిపితే అక్క‌డ కేసీఆర్ కు కోపం వ‌స్తుంది. అక్క‌డ వారి ఆస్తులు, వ్యాపారాల‌పై ఎటాక్ స్టార్ట్ అవుతుంద‌న్న భ‌యం వీరిని వెంటాడుతోంది. అందుక‌నే మ‌న‌కెందుకు రా బాబు ఈ రిస్క్ అని ఎవ‌రికి వారు గ‌ప్ చుప్‌గా ఉంటున్నారు. అందుకే త‌మ అధినేత‌ను, చివ‌ర‌కు తాము మ‌హా నేత అనుకునే వైఎస్‌ను ఇంత దారుణంగా తిడుతున్నా ఎవరికి వారు సైలెంట్ అవ్వ‌డ‌మో లేదా పొదుపు మాట‌ల‌తో కౌంట‌ర్ ఇచ్చి చేతులు దులుపు కోవ‌డ‌మో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: