వీళ్ల ప‌నుల‌తో జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు మండిపోతోందిగా...!

VUYYURU SUBHASH
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు పై రెండు జరుగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో తమను చావుదెబ్బకొట్టి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంటే  చంద్రబాబునాయుడు అండ్ కో కు బాగా మంటమీదున్నారు. వీళ్ళకు మద్దతుగా బలమైన మీడియా సెక్షన్ ఉండనే ఉంది. అయినదానికి, కానిదానికి డైరెక్టుగా జగన్నే టార్గెట్ చేసి ఉన్నవీ లేనివీ రాస్తున్నాయి. అంటే జగన్ వ్యతిరేక మీడియా వార్తలు, కథనాలు రాయటం, చంద్రబాబు అండ్ కో రెచ్చిపోవటం ఒకదానితో మరొకటి కలిసిపోయింది.
 జగన్ను ఎలాగైనా గబ్బుపట్టిద్దామన్న టార్గెట్ తోనే టీడీపీ+మీడియా పనిచేస్తుండటంతో సహజంగానే జగన్ మద్దతుదారులకు మండిపోతోంది. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏచిన్న సంఘటన జరిగినా దానికి డైరెక్టుగా జగన్నే బాధ్యుడిని చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతలు హత్యకు గురయ్యారు. స్ధానికంగా ఉండే గొడవల వల్ల హత్యలు జరిగాయి. అంతేకానీ వీళ్ళని టార్గెట్ చేయించి జగన్ ఏమీ హత్యలు చేయించలేదు. కానీ నారాలోకేష్ మాత్రం ఈ హత్యలను జగనే చేయించాడంటు నానా గోల చేస్తున్నారు.
నిజానికి హత్యకు గురైన ఇద్దరికీ జగన్ కు అసలు సంబంధమేలేదు. అయినా హత్యల్లోకి జగన్ పేరును లాగాల్సిన అవసరమే లేదు లోకేష్ కు. లోకేష్ ఆరోపణలపై మంత్రి కొడాలినాని మీడియా సమావేశంలో రెచ్చిపోయారు. చంద్రబాబు+లోకేష్ ను కలిపి నోటికొచ్చినట్లు మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉండగా చెఱుకులపాడు నారాయణరెడ్డి, ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా హత్యలు చేశారు. పై హత్యల్లో డైరెక్టుగా టీడీపీ నేతల హస్తముందనే విషయం ఆధారాలతో సహా బయటపడింది. ఆ విషయాల గురించి మళ్ళీ చంద్రబాబు, లోకేష్ అండ్ కో నొరెత్తరు.
ఫ్యాక్షన్ రాజకీయాలున్న ప్రాంతాల్లో దాడులు, ఎదురుదాడులు మామూలే. కొన్నిసార్లు ఇవి హత్యలకు కూడా దారితీస్తుంటాయి. అంతమాత్రాన అన్నీ ముఖ్యమంత్రులే చేయించారని చెప్పటంలో అర్ధంలేదు. ఇంతచిన్న విషయం చంద్రబాబు, లోకేష్ కు తెలీక కాదు. జగన్ పై ఏదో రకంగా బురదచల్లేయాలన్న ఉద్దేశ్యంతోనే ప్రతి గొడవలోను జగన్ పేరు లాగుతున్నారు.
వీళ్ళకు తగ్గట్టే సరిపోయారు కొడాలి నాని లాంటి వాళ్ళు. మీడియా సమావేశంలో మాట్లాడేటపుడన్నా కాస్త సభ్యతగా మాట్లాడాలన్న ఇంగితం కూడా కొడాలిలో లోపించింది. మామూలుగానే చంద్రబాబంటే కొడాలికి పూనకం వచ్చేస్తుంది. అలాంటిది చంద్రబాబు అండ్ కో కావాలనే రెచ్చగొడితే ఇక ఊరుకుంటారా ? ఇదంతా చూస్తుంటే కొడాలి లాంటి నేతలను చంద్రబాబు వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారని అర్ధమవుతోంది. కాబట్టి వీళ్ళు రెచ్చగొట్టడమూ నిజమే, వాళ్ళు రెచ్చిపోతుండటమే నిజమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: