రోజురోజుకూ వివాహితల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఇందులో వీరి చావులకు ముఖ్య కారణం అత్తా, మామల వేధింపులే ఎక్కువగా ఉంటున్నాయి. ఇపుడు కూడా అలాంటి విషాదకర ఘటనే జరిగింది. koti reddy SARIPALLI' target='_blank' title='కోటి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి ఆశలతో తాను ప్రేమించి పెండ్లి చేసుకున్న బావతో జీవితం పంచుకోవాలనుకుంది. కానీ ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తనకు అత్తకు రోజూ గొడవలు రావడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.
తనకు, తన అత్తకు మధ్యలో బావ రోజూ నలిగిపోవడం చూసి తట్టుకోలేకపోయింది. చివరకు ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె రాసిన సూసైడ్ లెటర్ విపరీతంగా వైరల్ అవుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువతి.. తన మేనత్త కొడుకును ప్రేమించింది. ఇరు కుటుంబాల పర్మిషన్ తో జూన్ 2020లో వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు ఆనందంగానే గడిపారు. ఇప్పుడు ఆమె నాలుగు నెలల గర్భిణి కూడా.
అయితే కొంతకాలం నుంచి అత్తాకోడళ్ల మధ్య తరచూ గొడవలు తలెత్తుతున్నాయి. ఇక ఆ యువతి తీవ్ర మనస్థాపానికి గురై చనిపోవాలని నిర్ణయించుకుంది. మంగళవారం ఆ యువతి మృతి చెందింది. కానీ కాలు జారి కిందపడటంతో గర్భస్రావం జరిగి మరణించిందని ఆమెకు అంత్యక్రియలు జరిపారు. కుమార్తెను పోగొట్టుకుని తీవ్ర బాధలో ఉన్న యువతి తల్లిదండ్రులు.. రక్తసంబంధీకులే కావడంతో యువతి అత్తామామలపై ఫిర్యాదు చేయలేకపోయారు.
కానీ బుధవారం మృతురాలి ఇంట్లో యువతి రాసిన సూసైడ్ నోట్ లభించింది. ఇందులో ఆమె ఇలా రాసుకొచ్చింది. "నా చావుకు కారణం అత్తమ్మ. బావా.. నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు. అత్తమ్మకు నాకు మధ్యలో నువ్వు నలిగిపోవడం నాకు నచ్చట్లేదు. ఆమెతో నాకు సరిపోయింది. అమ్మా నాన్నా.. నన్ను క్షమించండి.. ఐయామ్ సారీ.. బావా.. చెల్లి జాగ్రత్త. మామయ్య ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. నీ పొట్టిష.. అంటూ రాసుకొచ్చింది. ఇప్పుడు ఈ సూసైడ్ నోట్ నెట్టింట వైరల్ గా మారింది.