బాబుకు మంచి చేస్తున్న విజయసాయి....అర్ధం చేసుకోవట్లేదా?

M N Amaleswara rao

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే నిత్యం ఈ రెండు పార్టీల మధ్య ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రతిరోజూ ఏ వైసీపీ నాయకుడు చంద్రబాబుపై విమర్శలు చేసిన, చేయకపోయిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం నిత్యం బాబు టార్గెట్‌గా విమర్శలు చేస్తారు. సోషల్ మీడియా వేదికగా బాబుపై సెటైర్లు వేస్తుంటారు.


ఇక విజయసాయికి టీడీపీ నేతలు, కార్యకర్తలు కౌంటర్లు ఇస్తుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విజయసాయి ఎప్పటికప్పుడు బాబు లోపాలు, టీడీపీ పరిస్థితిపైనే సెటైర్లు వేస్తుంటారు. ఆయన విమర్శలని కరెక్ట్‌గా అర్ధం చేసుకుంటే టీడీపీకి మేలు జరిగేలాగానే ఉంటాయి. ఆ విమర్శలని బట్టి టీడీపీలో ఉన్న లోపాలు సరిచేసుకుంటే పార్టీకి కలిసొస్తుంది.


తాజాగా కూడా విజయసాయి, చంద్రబాబుపై సెటైర్లు వేశారు. పరాజయంపాలై రెండేళ్లు గడిచినా బాబులో ఇప్పటికీ పరివర్తన రాలేదని, ఎందుకు ఓడానో తెలియదని, తనను అర్థం చేసుకొనే శక్తిలేకే ఓడించారని ప్రజలను నిందిస్తున్నారని విజయసాయి మాట్లాడారు. అంటే ఎగ్జామ్ బాగా రాసినా పేపర్లు దిద్దిన టీచర్ కావాలనే తనను ఫెయిల్ చేశాడని విద్యార్థి ఏడ్చినట్టుంది బాబు వ్యవహారమని సెటైర్ వేశారు. విజయసాయి మాటలని సరిగ్గా అర్ధం చేసుకుంటే, టీడీపీకే మేలు జరుగుతుందని చెప్పొచ్చు.


వాస్తవానికి ఓడిపోయి రెండేళ్ళు అయినా బాబు మారలేదు. అన్నీ తాను బాగా చేశానని అయినా ప్రజలు తనని ఎందుకు ఓడించారో తెలియడం లేదని మాట్లాడుతున్నారు. అలా కాకుండా అసలు ఓటమి నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాం, గెలవాలంటే పార్టీని ఇంకా ఎలా బలోపేతం చేయాలనే విధంగా బాబు ఆలోచనలు చేయడం లేదు. ఎంతసేపు తాను బాగా చేసిన ప్రజలు ఎందుకు ఓడించారో తెలియడం లేదని మాట్లాడుతున్నారుగానీ, ఇప్పటికైనా ప్రజలకు ఎలా దగ్గరవ్వాలని బాబు ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి విజయసాయి మాటలని పాజిటివ్‌గా తీసుకుని పరిస్థితులని అనుకూలంగా మార్చుకుంటే పార్టీకే బెన్‌ఫిట్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: